మాస్క్‌ మనుషులు.. ఫోక్‌ డ్యాన్సులు

సినీ ఇండస్ట్రీకి కరోనా ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఎన్నడూ లేని విధంగా ఈసారి సినీ ప్రముఖులంతా తమతమ కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను తమ అభిమానులతో

Updated : 16 Nov 2020 06:59 IST

సోషల్‌ లుక్‌: సినీ తారల విశేషాలు మీకోసం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ఇండస్ట్రీకి కరోనా ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఎన్నడూ లేని విధంగా ఈసారి సినీ ప్రముఖులంతా తమతమ కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను తమ అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు సైతం ఆ తమ అభిమాన నటుల ఫొటోలను చూస్తూ మురిసిపోతున్నారు. వాటిలో కొన్ని మీకోసం..

* కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నమ్రత, మహేశ్‌బాబుతో పాటు ఉన్న మరో ఇద్దరు మాస్కులు పెట్టుకొని ఉన్నారు. మాస్క్‌ గ్యాంగ్‌ అంటూ నమత్ర ఈ పోస్టు చేశారు.
* బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగాన రనౌత్‌ తన సోదరుడి వివాహ కార్యక్రమంలో భాగంగా ఆడి పాడింది. ఈ సందర్భంగా తనకు ఫోక్‌ సాంగ్స్‌ అంటే ఇష్టమని చెబుతూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. 
* దీపావళి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వెనకాల తారాజువ్వలు వెలుగుతుండగా.. చిరు, చరణ్‌ ఇద్దరూ సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు.
* వింత ఆశ్చర్యంతోనే మొదలవుతుందని సోక్రటీస్ చెప్పారని సినీ నటి రాధికశరత్‌కుమార్‌ అన్నారు. చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్‌లో పంచుకున్నారు. అచ్చం అలాంటి ఓ ఫొటోను రామ్‌చరణ్‌ కూడా అభిమానులతో పంచుకున్నారు.
* నటి టబు.. ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్టు చేశారు.  
* రమ్యకృష్ణతో కలిసి ఉన్న ఫొటోను హీరోయిన్‌ విమలారామన్‌ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అందులో ఇద్దరూ చీరకట్టులో అందంగా ఉన్నారు.
* ఈ సోదరునితో వంట చేయడం సరదాగా ఉంటుంది అని బుల్లితెర నటి, యాంకర్‌ భానుశ్రీ ఓ వీడియో పోస్టు చేసింది. అందులో రోల్‌రైడా వంట చేస్తూ కనిపించాడు.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని