సోనూ సూద్‌కు మరో అరుదైన గౌరవం

ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు మరో గౌరవం దక్కింది.

Published : 18 Nov 2020 00:42 IST

శభాష్‌ సోనూ.. గవర్నర్‌ ప్రశంస

దిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు మరో గౌరవం దక్కింది. ఆయనను పంజాబ్‌ రాష్ట్ర ఎన్నికల ఐకాన్‌గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా సోనూసూద్‌కు పంజాబ్‌ గవర్నర్ వీపీ సింగ్‌ బద్నోర్‌ అభినందనలు తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఆయన సేవలు ప్రశంసనీయమని ప్రశంసించారు. ఈ గౌరవాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ సోనూ కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన తనకు ఈ అవకాశం వ్యక్తిగతంగా ఎంతో విలువైనదని ఆయన వివరించారు. తన రాష్ట్రానికి గర్వకారణమైనందుకు సంతోషంగా ఉందన్న సోనూ.. ఈ చర్య ద్వారా మరింత కృషి చేసేందుకు ప్రేరణ లభించిందన్నారు.

లాక్‌డౌన్‌ అనంతరం కూడా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో సోనూ ముందున్నారు. మాస్కులు, ఆహారం తదితర అవసరాలను వారికి అందిస్తున్నారు. ఇక నిజమైన హీరోగా ప్రజల గుండెల్లో ముద్రవేసుకున్న ఆయన ప్రముఖ విలేకరి మీనా అయ్యర్‌ సహాయంతో ‘ఐ యామ్‌ నో మెస్సయ్య’ అనే పుస్తకాన్ని రచించారు. కాగా.. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ పుస్తకం ఆంగ్లం, హిందీ భాషల్లో లభిస్తుందని తెలిపారు. కాగా సోనూ సూద్‌ ప్రస్తుతం ఆక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’ లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని