మన కథానాయికల నేపథ్యమేంటో తెలుసా?
అనుష్క.. పశుపతిని అంతం చేసిన జేజమ్మ.. కాజల్.. జోగేంద్ర కోసం ప్రాణత్యాగం చేసిన రాధ.. తమన్నా.. మహారాణి దేవసేనను చెర నుంచి తప్పించేందుకు పోరాడిన అవంతిక.. సమంత.. గట్టోడు చిట్టిబాబును ప్రేమలో పడేసిన రామలక్ష్మి.. ....
అనుష్క.. పశుపతిని అంతం చేసిన జేజమ్మ..
కాజల్.. జోగేంద్ర కోసం ప్రాణత్యాగం చేసిన రాధ..
తమన్నా.. మహారాణి దేవసేనను చెర నుంచి తప్పించేందుకు పోరాడిన అవంతిక..
సమంత.. చిట్టిబాబును ప్రేమలో పడేసిన రామలక్ష్మి..
నయనతార.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమానికి అడ్డుకాకూడదని ఆయనకు దూరమైన సిద్ధమ్మ..
అందం, అభినయంతో ఈ భామలు నేడు అగ్ర నటీమణులుగా వెలుగొందుతున్నారు సరే.. మరి ఆరంభంలో సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో ఎలా అడుగుపెట్టారు? అవకాశం వీరిని ఎలా వరించింది? వారి కుటుంబం నేపథ్యం ఏంటి?..
అనుష్క కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఆమె మాతృభాష తుళు. అసలు పేరు స్వీటీ శెట్టి. మంగళూరులోనే చదువుకున్నారు. ప్రఫుల్లా, ఎ.ఎన్ విఠల్ శెట్టి తల్లిదండ్రులు. స్వీటీకి ఇద్దరు సోదరులు. వీరిది వైద్య వృత్తి. చదువు పూర్తయ్యాక అనుష్క యోగా టీచర్గా పనిచేశారు. సినిమా ప్రపంచంతో సంబంధం లేని ఈ కుటుంబంలో నుంచి తొలిసారి అనుష్క వెండితెరపైకి వచ్చారు. అనుకోకుండా పూరీ జగన్నాథ్ సినిమా ‘సూపర్’లో అవకాశం దక్కించుకున్నారు. సినిమాల కోసం అనుష్కగా పేరు మార్చుకున్నారు. ఆపై అందరూ మెచ్చిన తారయ్యారు. అక్టోబరు 2న ఆమె ‘నిశ్శబ్దం’ సినిమా రాబోతోంది.
బెంగళూరులో నయనతార జన్మించారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. వీరి స్వస్థలం కేరళ. నయన్ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. దీంతో నయన్ బాల్యం ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. కళాశాలలో చదువుతున్న రోజుల్లో నయన్ మోడలింగ్ చేశారు. ఆ క్రమంలో ఓ దర్శకుడు ఆమెను గుర్తించడంతో, సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆపై అనేక చిత్రాల్లో అలరించి.. లేడీ సూపర్స్టార్గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు.
శ్రియ హరిద్వార్లో పుట్టి, పెరిగారు. ఆమె తండ్రి శరణ్ భట్నాగర్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పనిచేసేవారు, తల్లి నీరజ కెమిస్ట్రీ టీచర్. చిన్నతనం నుంచి డ్యాన్స్పై ఇష్టం పెంచుకున్న శ్రియ.. శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలో ఓ మ్యూజిక్ ఆల్బమ్లో నటించే అవకాశం వచ్చింది. దాని ద్వారా తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది. అలా ‘ఇష్టం’తో పరిచయమై.. ‘సంతోషం’తో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్లో ఉంటున్నారు. సినిమా షూటింగ్ల కోసం భారత్ వచ్చి, వెళ్తున్నారు. శ్రియ అన్నయ్య అభిరూప్ ముంబయిలో జీవిస్తున్నారు.
సమంత తండ్రి ప్రభు తెలుగు వారు. ఆమె తల్లి నినెట్ది కేరళ. సామ్ చెన్నైలోని పల్లవరంలో పెరిగారు. కుటుంబంలో ఆమే చిన్న కుమార్తె. ఇద్దరు అన్నయ్యలు జోనాథన్, డేవిడ్ ఉన్నారు. చిన్నతనం నుంచి సామ్ తమిళ అమ్మాయిలానే పెరిగారు. చెన్నైలో విద్య అభ్యసించారు. ఆమె డిగ్రీ చేస్తున్న రోజుల్లో మోడలింగ్ చేశారు. ఆ సమయంలో ఫిల్మ్ మేకర్ రవి వర్మన్ చూసి.. తను తీయబోయే తమిళ సినిమా ‘మాస్కోవిన్ కావేరి’లో కథానాయికగా తొలి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు కంటే ముందే ‘ఏ మాయ చేసావె’ విడుదలై.. హిట్ అందుకుంది. ఆపై సామ్ తన నటనతో చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగారు. నాగచైతన్యతో ప్రేమ వివాహం తర్వాత కూడా కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ పాఠశాలను ఆరంభించారు. ‘సాకీ’ అనే దుస్తుల బ్రాండ్ను కూడా స్థాపించారు. త్వరలో దీన్ని ఆరంభించబోతున్నారు.
కాజల్ పంజాబీ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి వినయ్ అగర్వాల్ వస్త్ర వ్యాపారం చేసేవారు. వీరి కుటుంబం ముంబయిలో స్థిరపడింది. కాజల్ అక్కడే విద్యనభ్యసించారు. ఐశ్వర్యరాయ్ నటించిన ‘క్యూ.. హో గయానా’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్ను ప్రారంభించిన కాజల్.. ‘లక్ష్మీ కల్యాణం’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనేక సినిమాలతో స్టార్గా ఎదిగారు. ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా నటిగా రాణించారు. ఇప్పుడు కాజల్ చేతిలో ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’, ‘భారతీయుడు 2’ తదితర చిత్రాలున్నాయి.
మిల్కీబ్యూటీగా దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ రాణిస్తున్న తమన్నా ముంబయిలో జన్మించారు. ఆమె తండ్రి సంతోష్ వజ్రాల వ్యాపారి. తల్లి రజని గృహిణి. ముంబయిలో చదువుతున్న రోజుల్లో తమన్నా పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో తన అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. 2005లో ‘శ్రీ’తో తెలుగు వారికి పరిచయమయ్యారు. వరుస సినిమాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘సీటీమార్’లో గోపీచంద్ సరసన నటిస్తున్నారు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే ముంబయిలో పుట్టి, పెరిగినప్పటికీ ఆమె స్వస్థలం మంగళూరు. తల్లిదండ్రులు లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే. పూజ ఎమ్.ఎమ్.కె. కళాశాలలో చదివారు. అప్పుడే ఫ్యాషన్, డ్యాన్స్ షోలలో చురుకుగా పాల్గొనేవారు. 2009 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. 2012లో ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో నటిగా అరంగేట్రం చేశారు. 2014లో ‘ఒకలైలా కోసం..’, ‘ముకుంద’ సినిమాలతో తెలుగు వారిని అలరించారు. ఇప్పుడు టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్నారు.
కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేటలో జన్మించారు రష్మిక. అక్కడి స్థానిక పాఠశాలలోనే చదువుకున్నారు. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే మోడలింగ్లో మెళకువలు నేర్చుకుని, పలు ప్రకటనల్లో నటించారు. 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా’ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆమెను చూసిన ‘కిర్రిక్ పార్టీ’ దర్శక, నిర్మాతలు ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా ఆమె నటిగా కెరీర్ ఆరంభించారు. తెలుగులో ‘ఛలో’, ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ , ‘భీష్మ’ సినిమాలతో అలరించారు. ‘పుష్ప’లో నటిస్తున్నారు.
‘ఫిదా’ భామ సాయిపల్లవి తమిళనాడులోని కోటగిరిలో జన్మించారు. రాధ, సెంతమరై కన్నన్ తల్లిదండ్రులు. తండ్రి పోలీసు అధికారి. సాయిపల్లవి కోయంబత్తూర్లో చదువుకున్నారు, అక్కడే పెరిగారు. ఇప్పుడు డాక్టర్ కోర్సు చేస్తున్నారు. డ్యాన్స్పై ఇష్టంతో చిన్నతనంలోనే అనేక షోలలో పాల్గొన్నారు. ‘ఢీ4’లో పాల్గొని, ఫైనల్కు వెళ్లారు. కానీ సాయిపల్లవి ప్రత్యేకంగా ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదట. 2014లో ఆమె జార్జియాలో చదువుతున్న రోజుల్లో దర్శకుడు ఆల్ఫోన్స్ పుతారెన్ ‘ప్రేమమ్’లో అవకాశం ఇచ్చారు. ఆపై ‘ఫిదా’ నుంచి ఆమె తెలుగు ప్రయాణం మొదలైంది. త్వరలో ఆమె నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతోంది.
రాశీ ఖన్నా దిల్లీలో పుట్టి, పెరిగారు. అక్కడే పాఠశాల, కళాశాల చదువులు పూర్తి చేశారు. చిన్నతనంలో గాయని కావాలి అనుకున్నారట. కానీ పెద్దయ్యే కొద్దీ చదువుపై ఆసక్తి పెరిగి, ఐఏఎస్ కావాలని కలలు కన్నట్లు ఓసారి చెప్పారు. చదువు పూర్తయ్యాక ప్రకటనలకు కాపీ రైటర్గా పనిచేశారు. తరువాత ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో 2013లో హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చింది. ఆ మరుసటి ఏడాది ‘ఊహలు గుసగుసలాడే’తో కథానాయికగా తెలుగువారికి పరిచయం అయ్యారు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి