‘శ్రీదేవి సోడా సెంటర్’ అంటున్న సుధీర్బాబు
యువ కథానాయకుడు సుధీర్బాబు ‘సూరిబాబు’గా మారారు. ఆయన కొత్త సినిమాను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీనికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్....
‘మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది..’
హైదరాబాద్: యువ కథానాయకుడు సుధీర్బాబు ‘సూరిబాబు’గా మారారు. ఆయన కొత్త సినిమాను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీనికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. ‘మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది..’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్ను సుధీర్ షేర్ చేశారు. జాతర వాతావరణాన్ని చూపిస్తూ.. ఆయన లుక్ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ సరసన ఎవరు సందడి చేయబోతున్నారో తెలియాల్సి ఉంది. అమలాపురం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
సుధీర్బాబు ఇటీవల ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన డీసీపీ ఆదిత్యగా నటించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. మరోపక్క ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్లోనూ ఆయన నటించనున్నారు. ఈ సినిమా కోసం గత కొంత కాలంగా కసరత్తులు చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ‘ఈ బయోపిక్ స్క్రిప్టు సిద్ధంగా ఉంది. డిసెంబరులో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. 2021 టోక్యో ఒలింపిక్స్ కంటే ముందు చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎంతో స్ఫూర్తినిచ్చే గోపీచంద్ జీవిత కథ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఈ సినిమా చూసిన తర్వాత కొందరైనా క్రీడాకారులుగా మారితే నా లక్ష్యం నెరవేరినట్లే’ అని ఇటీవల సుధీర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..