Sridevi Soda Center: కథ తర్వాతే వ్యాపారం
‘‘మా సంస్థ నుంచి వచ్చిన సినిమాల్ని గమనిస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కథల పరంగా ఒకదానికొకటి పొంతన లేదు. జోనర్ కంటే కూడా మా దగ్గరికి వచ్చిన ఆ కథే ముఖ్యం. కథ తర్వాతే వ్యాపారం
‘‘మా సంస్థ నుంచి వచ్చిన సినిమాల్ని గమనిస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కథల పరంగా ఒకదానికొకటి పొంతన లేదు. జోనర్ కంటే కూడా మా దగ్గరికి వచ్చిన ఆ కథే ముఖ్యం. కథ తర్వాతే వ్యాపారం గురించి ఆలోచిస్తాం. ఒక్కసారి స్క్రిప్టు నచ్చిందంటే మా కొత్త సినిమా ప్రయాణం మొదలైనట్టే’’ అంటున్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. 70 ఎమ్.ఎమ్.ఎంటర్టైన్మెంట్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తోంది ఈ ద్వయం. ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’... ఇలా వరుసగా విజయాలే. ఇటీవల సుధీర్బాబు కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడాసెంటర్’ నిర్మించారు. ఆ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘మంచి కథ ఎప్పుడు వస్తే అప్పుడు సినిమాని మొదలు పెట్టడం మా శైలి. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత చాలా మంది దర్శకులు హారర్ కామెడీ కథలతో వచ్చారు. కానీ అవేవీ ‘ఆనందో బ్రహ్మ’కంటే బాగున్నట్టు అనిపించలేదు. ‘యాత్ర’ తర్వాత జీవిత కథలతో వచ్చారు. కానీ నచ్చలేదు. ‘శ్రీదేవి సోడాసెంటర్’ కథ నచ్చడంతో వెంటనే మొదలుపెట్టాం. కథలవల్లే నిర్మాణంలో ఆలస్యం చోటు చేసుకొంటోంది తప్ప... మేం విరామం తీసుకోవడం లేదు. నిర్మాత శ్యాం ప్రసాద్రెడ్డి తీసింది ఏడు సినిమాలే. కానీ ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయన ఎంచుకున్న కథలే అందుకు కారణం. మేం కూడా కథే ప్రధానంగా ప్రయాణం చేస్తున్నాం’’.
* ‘‘వాస్తవికత ఉట్టిపడే కథతో ‘శ్రీదేవి సోడాసెంటర్’ రూపొందింది. దర్శకుడు కరుణకుమార్ తీసిన ‘పలాస’ ఒక ‘రా’ వాతావరణాన్ని ఆవిష్కరించింది. ఇది అందుకు భిన్నంగా సాగుతుంది. పూర్తిగా ఓ పల్లెటూరి నేపథ్యంతో కూడిన కథ. మణిశర్మకు కథ చెప్పగానే సంగీతం అందించడానికి ఒప్పుకున్నారు. నిజ జీవిత పాత్రల ఆధారంగా రూపొందిన చిత్రమిది. మొదట ఈ కథకి ‘నల్లవంతెన’ అనే పేరు అనుకున్నాం. కానీ ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది, దానికి తోడు ‘శ్రీదేవి సోడాసెంటర్’ చుట్టూ సాగే కథ కావడంతో అదే పేరునే ఖరారు చేశాం. సూరిబాబు పాత్రతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేయగానే సినిమాకి వ్యాపారం మొదలైంది. ప్రేక్షకులందరినీ సూరిబాబు ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఈ సినిమాతో అమెరికాలో ఓ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతున్నాం. 20 మంది కలిసి టికెట్స్ బుక్ చేసుకుంటే వారి కోసం ఓ షో ఏర్పాటు చేస్తాం. అక్కడ 120 థియేటర్లలోనూ, ఆంధ్ర, తెలంగాణలో 500 థియేటర్లలో విడుదల చేస్తాం’’.
* ‘‘స్నేహం ఒకవైపు, సినిమా మరోవైపు. సుధీర్, మేము సెట్లో హీరో... నిర్మాతల్లాగే మెలుగుతాం. బయటికొస్తే స్నేహితులం. అలా ఉండకపోతే సినిమా చేయలేం. సినిమాల విషయంలో మా ఆలోచనలు చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. చిరంజీవి సర్ సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది. మేం ఎంచుకునే కథల్నిబట్టే మహేష్బాబు, ప్రభాస్ ప్రోత్సహిస్తుంటారు. కథ మాకూ, కథానాయకులకి నచ్చితే స్టార్స్తోనూ సినిమాలు చేస్తాం. తదుపరి చిత్రాల కోసం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!