ఇకపై ప్రతి సినిమాకీ ఇలా చేస్తా..!
ఇకపై తాను నటించబోయే ప్రతి సినిమాకి గుర్తుగా ఓ మొక్కను నాటుతానని నటుడు సుధీర్బాబు ప్రతిజ్ఞ చేశారు. తాజాగా ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నటుడు నవీన్ కృష్ణ నామినేట్ చేయడంతో ఛాలెంజ్ను స్వీకరించిన సుధీర్ ఓ మొక్కను నాటి దానికి ‘వి’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ....
ఆదితి, నివేదాను నామినేట్ చేసిన సుధీర్
హైదరాబాద్: ఇకపై తాను నటించబోయే ప్రతి సినిమాకీ గుర్తుగా ఓ మొక్కను నాటుతానని నటుడు సుధీర్బాబు ప్రతిజ్ఞ చేశారు. తాజాగా ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నటుడు నవీన్ కృష్ణ నామినేట్ చేయడంతో ఛాలెంజ్ను స్వీకరించిన సుధీర్ ఓ మొక్కను నాటి దానికి ‘వి’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో గొప్ప కార్యక్రమానికి నాంది పలికిన ఎంపీ సంతోష్కుమార్కి అభినందనలు. ఈ ఛాలెంజ్కు నన్ను నామినేట్ చేసిన నవీన్ కృష్ణకు ధన్యవాదాలు. ఇకపై నేను చేయబోయే ప్రతి చిత్రానికి గుర్తుగా ఓ మొక్కను నాటుతానని, అలాగే ఆ సినిమా పేరుని మొక్కకు పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని ‘వి’ సినిమా నుంచి ప్రారంభిస్తున్నాను. దర్శకుడు మోహన్కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత దిల్రాజు, ఆదితిరావు హైదరీ, నివేదా థామస్ను ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేస్తున్నాను’ అని సుధీర్బాబు పేర్కొన్నారు.
సుధీర్బాబు పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన ‘వి’ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. నాని ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, ఆదితిరావు హైదరీ కథానాయికలుగా మెప్పించారు. మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె