Surya: అలాంటి ప్రయత్నాలూ చేయాలి
సూర్య... ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల సొంతం అయ్యారు. ఆయన సినిమా విడుదలవుతోందంటే తెలుగులోనూ ఆ సందడి ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. సూర్య చేసిన గత రెండు సినిమాలూ ఓటీటీ
సూర్య... ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల సొంతం అయ్యారు. ఆయన సినిమా విడుదలవుతోందంటే తెలుగులోనూ ఆ సందడి ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. సూర్య చేసిన గత రెండు సినిమాలూ ఓటీటీ మాధ్యమాల్లోనే విడుదలయ్యాయి. ఈసారి ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఈటి’ ఈ నెల 10న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సూర్య ఇటీవల హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
చాలా రోజుల తర్వాత మీ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. దీనిపై మీ అభిప్రాయం?
కరోనా కష్ట సమయాల్లోనూ ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో ప్రేక్షకులకి వినోదం పంచడం ఎంతో తృప్తినిచ్చింది. తెలుగు సినిమాలు ‘అఖండ’, ‘పుష్ప’ మొదలుకొని ‘భీమ్లానాయక్’ వరకు ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్కి తీసుకు రావడం సాధ్యమనే భరోసానిచ్చాయి. ఆ భరోసాతోనే ఇతర పరిశ్రమలూ విరివిగా సినిమాలు నిర్మిస్తూ, విడుదలలకి సిద్ధమవుతున్నాయి. ‘ఈటి’ థియేటర్కి వచ్చే ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించింది.
‘ఈటి’తో మహిళలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తావిస్తున్నారా?
ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా సినిమాలు చేయడం ఓ బాధ్యతగా భావిస్తున్నా. నేను నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా చూసి దర్శకుడు వెట్రిమారన్ ధూమపానం మానేశాడట. వినోదం కోసమే కాకుండా అలాంటి మార్పు కోసం సినిమాలు చేస్తే బాగుంటుంది కదా. మహిళల విషయంలో మన ఆలోచనా ధోరణి ఎలా ఉందో, మనలో ఎలాంటి మార్పు రావాలనే అంశాన్ని అంతర్లీనంగా చెప్పారు దర్శకుడు. ఇంటికి ఓ అతిథి వచ్చాడంటే వెంటనే నీళ్లు తీసుకురా అని ఆడవాళ్లకే చెబుతుంటాం. వాళ్లతో మాట్లాడే విధానం దగ్గర్నుంచి, పనిచెప్పడం వరకు ఎన్నో విషయాల్ని స్పృశిస్తూ ఇందులో దర్శకుడు ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. మనం ఇంట్లో చర్చించుకోవడానికి అంతగా ఇష్టపడని ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయి.
‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’... ఆస్కార్ కోసం పోటీపడ్డాయి. వాటిలో నటించేటప్పుడు సాహసం చేస్తున్నట్టుగా భావించారా?
కొన్నింటిని వదులుకుంటే చాలా సంపాదిస్తామనే మాటని నేను బలంగా నమ్ముతాను. అహం మొదలుకొని అందులో చాలానే ఉన్నాయి. ఆ విషయంలో నాకు సత్యరాజ్ మామే స్ఫూర్తి. నా తొలి పుట్టినరోజు నన్ను బయటికి తీసుకెళ్లి చాక్లెట్ కొనిచ్చిన సత్యరాజ్ మామతో కలిసి నేను నటించిన తొలి సినిమా ఇదే. ఆయన మొదట విలన్గా చేశాడు, ఆ తర్వాత హీరో అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ కట్టప్ప తరహా పాత్రలు చేశాడు. నేటితరం నన్ను విలన్గా చూడలేదు కదా, అందుకే మళ్లీ విలన్గా నటిస్తా అంటున్నారు. అలా విభిన్నమైన ప్రయత్నాలు చేసేంత ఆత్మవిశ్వాసాన్నిచ్చిన సినిమాలే ఆ రెండూ. ఈ కథల గురించి చెప్పినప్పుడు నీ స్టైల్ సినిమాలు కాదన్నవాళ్లు చాలా మందే. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో పెళ్లాంతో చెంప దెబ్బ తింటాను, ఆమెని డబ్బు అడుగుతాను. ‘జై భీమ్’లో తొలి అరగంట వరకు నా పాత్ర కనిపించదు. హీరోయిజం గురించి ఆలోచిస్తే ఆ తరహా సినిమాలు చేయలేం. వాటి గురించి ఆలోచించకుండా చేశాను కాబట్టే ఆ సినిమాలు నాకు అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. గుర్తింపుకి నోచుకోని తెగల గురించి, వారి సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించేలా చేసింది ‘జై భీమ్’. సామాజిక మార్పుని తీసుకొచ్చిన చిత్రాలవి. ఫాంటసీ సినిమాలే కాదు, ఈ తరహా ప్రయత్నాలు అప్పుడప్పుడు చేయాల్సిందే.
ఓటీటీ మాధ్యమంలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు ఎదురైన ఒత్తిడిని ఎలా అధిగమించారు?
సహజంగా మనకు ఎప్పుడూ కనిపించే ఒత్తిడే అది. థియేటర్ వచ్చినప్పుడు రంగస్థల వేదికలు కలవరపడ్డాయి, టెలివిజన్ వచ్చినప్పుడు థియేటర్ మనుగడ ఎలా అనే ఆందోళన మొదలైంది. ఇప్పుడు మా పిల్లలు టెలివిజన్ కాకుండా యూ ట్యూబ్ని చూస్తున్నారు. ఇలాంటి మార్పుని మనం ఎవ్వరం ఆపలేం కదా. అన్ని వేదికలు కలిసి మనుగడ సాధించడమే కీలకం. కొత్త వేదికల తర్వాత తప్పకుండా మంచి కంటెంట్ వెలుగులోకి వస్తుంది. తమిళనాడులో దాదాపుగా 8 కోట్ల జనాభా ఉంది. అందులో 80 లక్షల మందే సినిమాలు చూస్తారు. మిగతా ప్రేక్షకుల్ని ఓటీటీ తరహా మాధ్యమాలతో సినిమాల్ని చేరువచేసే అవకాశం ఉంది. దానికితోడు ‘బాహుబలి’ తరహా సినిమాలతో భాషల మధ్య హద్దులు చెరిగాయి. ఓటీటీ మాధ్యమాలు ఆ హద్దుల్ని మరింతగా తుడిచేశాయి.
కొత్త సినిమాల సంగతులేమిటి?
బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ‘వాడివాసల్’ పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వందల మందికిపైగా కలిసి చేయాల్సిన సన్నివేశాలు అందులో ఉంటాయి. కరోనావల్ల అది సాధ్యపడటం లేదు. జూన్లో చిత్రీకరణ ప్రారంభిస్తామేమో.
‘ఈటి’ కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు. ఎలా అనిపించింది?
ఈ సినిమా కోసం తెలుగులో సంభాషణల్ని చెప్పడాన్ని చాలా ఆస్వాదించా. తమిళం కంటే ముందు తెలుగు డబ్బింగ్నే పూర్తి చేశా. తెలుగు వెర్షన్ డబ్బింగ్ చాలా బాగుందని దర్శకుడు మెచ్చుకున్నారు. ‘గ్యాంగ్’ కోసం చెప్పాను కానీ... ఇది ఎక్కువ తృప్తినిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM