
సుశాంత్ ఆత్మహత్య కేసు: కీలక మలుపులు
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సుశాంత్ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తీసుకుంటూ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. తాజాగా మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రియా, ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్కు సంబంధించిన రూ.15కోట్లు మనీలాండరింగ్కు పాల్పడినట్లు సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.
గత నాలుగు రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ కుటుంబ సభ్యులు, నటి రియా చక్రవర్తిల నడుమ ఈ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. జులై 25న సుశాంత్ తండ్రి రియా చక్రవర్తిపై పట్నా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాడు. దీంతో నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం జులై 29న ముంబయి చేరుకుని కేసు విచారణ చేపట్టింది. మరోవైపు ఈ కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును అభ్యర్థించింది. బిహార్ ప్రభుత్వంతో పాటు సుశాంత్ తండ్రి ఈ అభ్యర్థనను తోసి పుచ్చారు.
మరోవైపు బిహార్ పోలీసులు సుశాంత్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. అంతేకాకుండా రియా చక్రవర్తి ఇంటిని కూడా సోదా చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రియా ఖాతాకు పెద్దగా నగదు బదిలీ ఏమీ జరగలేదని గుర్తించారు. సుశాంత్ కుటుంబ సభ్యులు చెబుతున్నంత నిల్వ కూడా ఖాతాలో లేదని తెలిసింది. సుప్రీంకోర్టుకు రియా సమర్పించిన పిటిషన్లో తాను సుశాంత్తో ఏడాదిగా లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో సుశాంత్ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు చెప్పింది. సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకిత లోఖండే వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు.
ప్రస్తుతం బీఎండబ్ల్యూ, జాగ్వార్ కార్ల విషయంలో బిహార్ పోలీసులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత రాత్రి అంకిత ఇంటికి ఆటోలో వచ్చిన పోలీసులు వెళ్లేటప్పుడు గంటసేపు విచారణ అనంతరం జాగ్వార్ కారులో వెళ్లారు. ఈ రోజు ఉదయం బిహార్ పోలీసులు బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే డిమాండ్ చేశారు. కాగా, తాజాగా దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందిస్తూ ‘సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు సీబీఐకి అప్పగించాలని చాలా మంది కోరుతున్నారు. అయితే, మనీలాండరింగ్ జరిగిందన్న కోణం కూడా ఉండటంతో కనీసం ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అప్పగించాలి’ అని ట్వీట్ చేశారు. కొద్దిసేపటికే ఈడీ కేసు నమోదు చేయడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
-
General News
Telangana News: జూన్ 26కు చాలా ప్రత్యేకత ఉంది: రేవంత్ రెడ్డి
-
Movies News
Social Look: సెకనులో రకుల్ ఫొటో.. తాప్సి ‘లండన్ పింక్’.. సోనాక్షి ‘సెల్ఫీ’!
-
Crime News
Crime news: హైదరాబాద్లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
-
General News
Thirumala: తిరుమలలో మరోసారి ఏనుగుల కలకలం
-
Politics News
Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్