సుశాంత్ సింగ్ది హత్యే: సుబ్రహ్మణ్య స్వామి
యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ది హత్య అని తను గట్టిగా నమ్ముతున్నట్టు భాజపా సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ది హత్య అని తాను గట్టిగా నమ్ముతున్నట్టు భాజపా సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ప్రకటించారు. అలా భావించేందుకు ఆధారాలను కూడా ఆయన నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. సుశాంత్ సింగ్ బాంద్రాలో ఉన్న తన నివాసంలో జూన్ 14న మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం వెలువడిన పోస్ట్మార్టం నివేదికలో కూడా నటుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవచ్చింది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సాధ్యంకాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వామి స్పందిస్తూ.. వరుస ట్వీట్లు చేశారు.
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబయి మూవీ మాఫియా పనిచేస్తోందని.. ఈ క్రమంలో ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమయిందని ఆయన అన్నారు. ‘‘సుశాంత్ సింగ్ రాజ్పూత్ హత్య గురైయ్యాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే...’’ అంటూ ఆయన చేసిన మరో ట్వీట్లో 26 అంశాలతో కూడిన ఓ పత్రాన్ని షేర్ చేశారు. దానిలో ఆయన శరీరంపై ఎవరో కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్టుగా ఉంది. అంతేకాకుండా సుశాంత్ మెడపై చిహ్నాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను సుబ్రహ్మణ్య స్వామి బుధవారం కోరారు. గతంలో ప్రధాని మోదీకి రాసిన లేఖలో కూడా యువనటుడి మరణంతో కొందరు బాలీవుడ్ పెద్దలకు సంబంధం ఉందని.. వారు ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాలంటూ ముంబయి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిపై పట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె