రియాను చిత్ర హింసలు పెట్టొద్దు.. వదిలేయండి..!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టు చేసిన రియా చక్రవర్తిని ఇకనైనా విడుదల చేయాలని బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, బిహార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి రియాకు మద్దతుగా మాట్లాడారు. జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.....

Published : 05 Oct 2020 17:47 IST

ఎయిమ్స్‌ రిపోర్ట్‌.. స్వరా భాస్కర్‌ ట్వీట్‌

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టు చేసిన రియా చక్రవర్తిని ఇకనైనా విడుదల చేయాలని బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి రియాకు మద్దతుగా మాట్లాడారు. జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘సుశాంత్‌ కేసులో ఆమెను ఇకపై చిత్రహింసలు పెట్టకుండా స్వేచ్ఛగా వదలండి. ఆయన మరణం మమ్మల్ని కూడా ఎంతో బాధించింది. కానీ ఓ మహిళను నిందితురాలిగా అభివర్ణించడంతో మనం ఆయనకి గౌరవం ఇచ్చినట్లు కాదు. రియా చక్రవర్తి అమాయకురాలని నేను ఇంతకు ముందే చెప్పాను. మరింత వేధింపులకు గురిచేయకుండా ఆమె విడుదల చేయాలి, రియా రాజకీయ కుట్రకు గురైంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అధిర్‌ రంజన్‌ చౌదరి వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ స్వరా స్పందించారు. ‘చాలా బాగా చెప్పారు సర్‌.. రియా చక్రవర్తిని విడుదల చేయండి’ అని ట్వీట్‌ చేశారు.

జూన్‌ 14న తన ఇంట్లో సుశాంత్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. డ్రగ్స్‌ చాటింగ్‌ జరిగిందని గుర్తించారు. దీంతో ఎన్సీబీ రంగంలోకి దిగి...రియాతోపాటు 16 మందిని అరెస్టు చేసింది. ఆమె బెయిల్‌ మంజూరు దరఖాస్తుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. రియా డ్రగ్స్‌ తన ఇంట్లో భద్రపరిచి, సుశాంత్‌కు ఇచ్చేవారని.. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే కేసు విచారణకు సమస్యలు ఏర్పడతాయని ఎన్సీబీ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మరోపక్క సుశాంత్‌ది ఆత్మహత్యని, హత్య కాదని ఎయిమ్స్‌ శనివారం వెల్లడించింది. ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు, గాట్లు లేవని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు