సినీనటి తాప్సీకి జరిమానా!

సొట్టబుగ్గల సుందరి తాప్సీపన్నుకి జరిమాన పడింది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు ఈ శిక్ష పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే తాప్సీ.. కాస్త తీరిక సమయం దొరకడంతో బైక్‌ నడిపిందట. అయితే.. హెల్మెట్‌ లేకుండా

Updated : 19 Nov 2020 08:42 IST

ముంబయి: సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నుకి జరిమానా పడింది. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు తనకు ఫైన్‌ పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే తాప్సీ.. కాస్త తీరిక సమయం దొరకడంతో బైక్‌ నడిపిందట. అయితే.. హెల్మెట్‌ లేకుండా రోడ్లపై తిరిగినందుకు ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ఆమెకు జరిమాన విధించారట. అభిమానులు మాత్రం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆమె కోరింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దానికి ఆమె వాహనం నడిపిస్తున్న ఫొటోను కూడా జతచేసింది.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటోందీ దిల్లీ ముద్దుగుమ్మ. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ భామ ఈ ఇటీవల కాలంలో బీటౌన్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. తాప్సీ తన తర్వాతి సినిమాలో బ్యాట్మింటన్‌ క్రీడాకారిణిగా అభిమానుల ముందుకు రానుంది. గుజరాత్‌కు చెందిన షట్లర్‌ రష్మీ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె నటిస్తోంది. అందుకోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటూ చెమటోడుస్తోంది. ఆ సినిమా తర్వాత భారత మహిళా క్రికెటర్‌ మిథాలిరాజ్‌ పాత్ర జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘శెభాష్‌ మిథూ’ సినిమాతో ఆమె క్రికెటర్‌ అవతారమెత్తనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని