మణిరత్నం..శంకర్‌ కలిసి

‘నవరస’ వెబ్‌సిరీస్‌ను దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మించిన మణిరత్నం మరో అగ్ర దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌, మణిరత్నం కలిసి రెయిన్‌ ఆన్‌ ఫిలిమ్స్‌ ప్రై.లి పేరుతో

Updated : 26 Aug 2021 08:04 IST

‘నవరస’ వెబ్‌సిరీస్‌ను దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మించిన మణిరత్నం మరో అగ్ర దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌, మణిరత్నం కలిసి రెయిన్‌ ఆన్‌ ఫిలిమ్స్‌ ప్రై.లి పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో మరికొందరు తమిళ దర్శకులు కూడా భాగం కానున్నారు. వారిలో వెట్రిమారన్‌, గౌతమ్‌ మేనన్‌, లింగుస్వామి, మిస్కిన్‌, శశి, వసంత బాలన్‌, లోకేష్‌ కనగరాజ్‌, బాలాజీ శక్తివేల్‌, మురుగదాస్‌ తదితరులు ఉన్నారు. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను ఈ సంస్థ నిర్మించనుంది. ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు కల్పించడం కోసం ఈ సంస్థని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సంస్థలో తొలి చిత్రాన్ని  లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ని తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాకా రెయిన్‌ ఆన్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిలో సినిమా పట్టాలెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని