ఆలోచనలు అంత పదునని అర్థం!
‘‘నేను పరిశ్రమకి ‘ప్రస్థానం’తో పరిచయమయ్యా. ‘ఆటోనగర్ సూర్య’తో పరిశ్రమ అంటే ఏమిటో నాకు పరిచయమైంది. సంధి కుదిరింది కాబట్టి... ఇక నుంచి విరామం లేకుండా సినిమాలు చేస్తా’’ అంటున్నారు దేవాకట్టా. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన
‘‘నేను పరిశ్రమకి ‘ప్రస్థానం’తో పరిచయమయ్యా. ‘ఆటోనగర్ సూర్య’తో పరిశ్రమ అంటే ఏమిటో నాకు పరిచయమైంది. సంధి కుదిరింది కాబట్టి... ఇక నుంచి విరామం లేకుండా సినిమాలు చేస్తా’’ అంటున్నారు దేవాకట్టా. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటీవల సాయి తేజ్ కథానాయకుడిగా ‘రిపబ్లిక్’ తెరకెక్కించారు. ఆ చిత్రం అక్టోబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దేవా కట్టా మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘అడవి గురించి తెలియకుండా మనం అడవిలో బతకలేం. సమాజమూ అంతే. మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో తెలుసుకోవాలి. ఒక రకంగా ఈ కథకి నాలోని అజ్ఞానమే స్ఫూర్తి అనుకోవచ్చు. మనం తరచూ ‘ఈ వ్యవస్థ ఉంది చూడు, ఈ రాజకీయ నాయకులు ఉన్నారు చూడూ’ అంటూ, ప్రజాస్వామ్యం, నియంతృత్వం అంటూ వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ వాటి గురించి మనకు ఎంత లోతుగా తెలుసు? ఒక విద్యావంతుడిగా నాకు కలిగిన సిగ్గుతో దాని గురించి చదువుకుని రాసుకున్న కథే... ‘రిపబ్లిక్’. 15 ఏళ్లు అమెరికాలో పెరగడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎలా చూస్తున్నాం? అనే విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసులో వచ్చిన కొన్ని ప్రశ్నలు ఈ కథకి స్ఫూర్తినిచ్చాయి’’.
* ‘‘రోడ్డు ప్రమాదం తర్వాత సాయి తేజ్ని కలిశా. తనతో మాట్లాడిన తర్వాతే అక్టోబర్ 1న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించాం. తను ‘రిపబ్లిక్’ ముందస్తు విడుదల వేడుక చూశారు. వేగంగా కోలుకుంటున్నాడు. ముందస్తు విడుదల వేడుకలో పవన్ కల్యాణ్ ఆయనదైన గళం వినిపించారు. మా సినిమా మాత్రం రాజకీయ కోణాలకి సంబంధం లేని తటస్థ అభిప్రాయాలతో, అంశాలతో తెరకెక్కింది. నా విజన్లోనే నేను సినిమా తీసేలా సాయి తేజ్ నన్ను ప్రోత్సహించాడు. ఓ సైనికుడిలా నాకు అండగా నిలబడ్డాడు’’.
‘‘వెన్నెల, ప్రస్థానం సినిమాలు చేసినప్పుడు నాకున్న వనరులు చాలా తక్కువ. ‘వెన్నెల’ సినిమా చేస్తున్నప్పుడు వ్యానిటీ వ్యాన్ని నేను స్వయంగా నడుపుకుంటూ సెట్కి వెళ్లేవాణ్ని. అక్కడిదాకా డ్రైవర్ని, అక్కడికెళ్లాక దర్శకుడిని. అప్పట్లో స్వేచ్ఛ ఉండేది. ‘ప్రస్థానం’ తర్వాత చుట్టుపక్కలవాళ్ల లెక్కలు ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ‘ప్రస్థానం’ ఘన విజయం సాధించకపోవడానికి కారణం అందులో కామెడీ లేకపోవడం, మరొక వాణిజ్యాంశం లేకపోవడం అంటూ నాపై వాళ్ల అభిప్రాయాల్ని రుద్దడం మొదలుపెట్టారు. తీరా వాళ్లు చెప్పినవన్నీ చేసి సినిమా తీస్తే, దాన్ని ప్రేక్షకులు తిప్పికొట్టారు. ‘డైనమైట్’కి 9 రోజులే పనిచేశా. తర్వాత ఎవరికి కావల్సినట్టు వాళ్లు చిత్రీకరణ చేసుకున్నారు. ‘రిపబ్లిక్’ విషయంలో అలాంటి ప్రభావాలు ఏవీ లేకుండా నాదైన విజన్తోనే తీశా. చంద్రబాబు నాయుడు, వై.ఎస్.ఆర్ జీవితాల్ని ఆధారంగా చేసుకుని ఓ స్క్రిప్ట్ని సిద్ధం చేశా. వాళ్ల కాలేజీ జీవితాలు మొదలుకొని, వై.ఎస్ మరణం వరకు సాగే కథ ఇది. ఆ సినిమాని ‘గాడ్ఫాదర్’ తరహాలో ‘ఇంద్రప్రస్థం’ పేరుతో మూడు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నా. వెన్నెల తరహా కథలూ సిద్ధంగా ఉన్నాయి’’.
* ‘‘ప్రజలకీ... రాజకీయ నాయకులకీ అనుసంధానంగా ఉండే ఓ అధికారి నిజాయతీగా ఉన్నప్పుడు తన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? తను వ్యవస్థని చూసే విధానం ఎలా ఉంటుంది? తన ఆలోచనల వల్ల ప్రయాణం ఎలా సాగిందనే అంశాల ఆధారంగా ‘రిపబ్లిక్’ కథని తయారు చేసుకున్నా. సాయితేజ్కు ఈ కథ గురించి ఒక రోజు జిమ్లో చెప్పా. సాధారణ పౌరుడిగా తను ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాడు. కథగా రాయకముందే తనతోనే సినిమా చేయాలని తేజ్ నాతో మాట తీసుకున్నాడు.
* ఐశ్వర్య రాజేశ్ ఇందులో ఎన్నారై యువతిగా కనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్ర కోసం ముందు భారతీరాజా, మహేంద్రన్ లాంటి దర్శకుల్ని ఎంచుకుందాం అనుకున్నాం. కొత్తదనం కోసం ఆ పాత్రని మహిళగా మార్చాం. ట్రైలర్లో వినిపించిన మాటల గురించి అందరూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మాటలకి అంత స్పందన వచ్చిందంటే అవి రాయడం వెనకున్న ఆలోచనలు అంత పదునుగా ఉన్నాయని అర్థం!’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!