ఓ ఓబులమ్మ..

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. ఈ సినిమా అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు.

Updated : 07 Dec 2022 22:31 IST

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. ఈ సినిమా అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘గింజ గింజ మీద.. బుసక బుసక బుసక తీసి తియ్యంగ బత్తెమై పోయే.. బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని.. ఓ ఓబులమ్మ..’’ అంటూ రాయలసీమ యాసలో సాగుతున్న ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా సాహిత్యం అందించారు. సత్య యామిని, పివిఎస్‌ఎస్‌ రోహిత్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్‌, రకుల్‌ల జోడీ చూడముచ్చటగా కనిపించింది. జ్ఞానశేఖర్‌ విజువల్స్‌ ఈ గీతానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
‘‘అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్‌ చిత్రమిది. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కించారు. రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా కనిపిస్తుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి కూర్పు: శ్రవణ్‌ కటికనేని, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని