మారేడుమిల్లిలో హను-మాన్‌

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హను-మాన్‌’. ‘జాంబిరెడ్డి’ లాంటి విజయం తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

Updated : 02 Oct 2021 07:18 IST

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హను-మాన్‌’. ‘జాంబిరెడ్డి’ లాంటి విజయం తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం మారేడుమిల్లి, పాడేరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంటోందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సెట్లోని కొన్ని స్టిల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ ఫొటోల్లో ప్రశాంత్‌ ఓ సన్నివేశం వివరిస్తుండగా.. తేజ ఆయన మాటలు శ్రద్ధగా వింటూ కనిపించారు. ప్రస్తుత షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌తో పాటు పాటలు చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని