భారత దేశమంత స్వచ్ఛమైన సినిమా
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో గురు పవన్ తెరకెక్కించిన చిత్రం ‘ఇదే మా కథ’. జీ మహేశ్ నిర్మించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది.
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో గురు పవన్ తెరకెక్కించిన చిత్రం ‘ఇదే మా కథ’. జీ మహేశ్ నిర్మించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఎస్.రాజు, బి.గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఓ నలుగురు వ్యక్తుల కథ ఇది. వారి లక్ష్యాలేంటి? వాటిని ఎలా చేరుకున్నారు? ఈ క్రమంలో ఒకరికొకరు ఎలా సహాయ పడ్డారు? అనేది మిగతా కథాంశం. సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది. సుమంత్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుంది. లద్దాఖ్లో నీళ్లలో జంప్ చేసి, ఓ యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. అంత చలిలో అలా చేయడం చూసి నాకు భయమేసింది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అంతా చూపించాం. ఈ ప్రయాణంలో శ్రీకాంత్, భూమిక గారితో పని చేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. కథను నమ్మి, ఎంతో ధైర్యంతో మహేష్ ఈ చిత్రాన్ని తీశార’’న్నారు హీరో సుమంత్ అశ్విన్. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నేను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్న సమయంలో ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లాను. 5వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథ రాశాను. భారత దేశం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో.. మా సినిమా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కథ నమ్మి సినిమా చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంత్, భూమిక, సుమంత్, తాన్యలకు థ్యాంక్స్’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు