బెల్లంకొండకు జోడీగా

ప్రభాస్‌.. రాజమౌళిల హిట్‌ సినిమా ‘ఛత్రపతి’ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. జయంతిలాల్‌ గడ నిర్మాత.

Updated : 17 Sep 2021 07:32 IST

ప్రభాస్‌.. రాజమౌళిల హిట్‌ సినిమా ‘ఛత్రపతి’ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. జయంతిలాల్‌ గడ నిర్మాత. ఇందులో బెల్లంకొండకు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ పాత్ర కోసం తొలుత అనన్య పాండే, దిశా పటాని లాంటి పేర్లు వినిపించాయి. అయితే ఆ అవకాశం బాలీవుడ్‌ భామ నుష్రత్‌ బరుచాను వరించినట్లు సమాచారం. ‘తాజ్‌ మహల్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నాయిక‘ప్యార్‌ కా పంచనామా 2’, ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘సోను కే టిటు కి స్వీటీ’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ఉత్తరాది వాసులకు దగ్గరైంది. అందుకే నుష్రత్‌ నటనను మెచ్చే వినాయక్‌ ‘ఛత్రపతి’ రీమేక్‌కు ఆమెను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు ప్రచారం వినిపిస్తోంది. నుష్రత్‌ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘రామ్‌ సేతు’ చిత్రంలో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని