వాస్తవ ఘటనలతో ‘కళాకార్‌’

కథానాయకుడు రోహిత్‌ చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం ‘కళాకార్‌’. శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. తొలిసారి రోహిత్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్న ...

Updated : 20 Sep 2021 08:08 IST

థానాయకుడు రోహిత్‌ చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం ‘కళాకార్‌’. శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. తొలిసారి రోహిత్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ టీజర్‌ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీజర్‌ చూసి చాలా బాగుందని చెప్పార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రంతో కథానాయకుడిగా తన కెరీర్‌ని పునః ప్రారంభిస్తున్న రోహిత్‌ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు’’ అన్నారు. ‘‘సినిమా పూర్తయింది. దసరాకి విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని