చిరు చెల్లెలుగా కీర్తి

చిరంజీవి ‘ఆచార్య’తోపాటు మరో మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. అందులో ‘వేదాళం’ రీమేక్‌ ఒకటి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 07 Aug 2021 07:06 IST

చిరంజీవి ‘ఆచార్య’తోపాటు మరో మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. అందులో ‘వేదాళం’ రీమేక్‌ ఒకటి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చిరుకి సోదరిగా కనిపించే కీలకమైన ఓ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కోసం సాయిపల్లవితోపాటు పలువురు కథానాయికల్ని పరిశీలించారు. సాయిపల్లవి, కీర్తిసురేష్‌ల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని చిత్రబృందం ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు ఆ పాత్రలో నటించేందుకు కీర్తి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరు కొన్ని సన్నివేశాల్లో గుండుతో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఇదివరకే మేకప్‌ టెస్ట్‌ కూడా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని