సంద్రం ఉప్పొంగేది ఆరోజే

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందించిన చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నాయికలు.

Updated : 28 Aug 2021 08:56 IST

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందించిన చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ నాయికలు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ఒకరిపై మరొకరు తుపాకులు ఎక్కుపెట్టుకుని కనిపించారు. వీరికి కొంత దూరంలో ఉన్న సముద్రంలో అదితిరావు నీళ్లలో నిలబడి దర్శనమిచ్చింది. ‘‘ఓ గాఢమైన ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. విశాఖపట్టణం నేపథ్యంలో సాగుతుంది. సినిమాలో శర్వా, సిద్ధార్థ్‌ మాస్‌ లుక్‌లలో కనిపించనున్నారు’’ అని చిత్ర బృందం తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని