నమః శివాయ

కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ తెరకెక్కిస్తున్నారు. కమల్‌ కామరాజు, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 07 Aug 2021 07:01 IST

కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ తెరకెక్కిస్తున్నారు. కమల్‌ కామరాజు, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘నమఃశివాయ’’ గీతాన్ని కథానాయకుడు బాలకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ఈ పాటకు శ్రవణ్‌ భరద్వాజ్‌ స్వరాలందించగా.. లలిత, కాలభైరవ ఆలపించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి పాటను నా చేతుల మీదుగా విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలోని లేపాక్షి ఆలయంలో ఈ గీతాన్ని చిత్రీకరించారు. పాట చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు రేవంత్‌, నటీనటులు సంధ్యారాజు, కమల్‌ కామరాజు చాలా కష్ట పడ్డారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ శివుడి ఆశీస్సులు చిత్ర బృందానికి ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘పాట చిత్రీకరణకు ఆరు రోజుల సమయం పట్టింది. వందలాది ఆర్టిస్ట్‌లతో లేపాక్షి ఆలయంలో షూట్‌ చేశాం. 40డిగ్రీల ఎండలో.. ఓవైపు కాళ్లు కాలుతున్నా ఎంతో కష్టపడి చిత్రీకరణ జరిపాం. నాట్యం ప్రధానంగా సాగే చిత్రమిది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి కళ: మహేశ్‌ ఉప్పుటూరి, ఛాయాగ్రహణం: రేవంత్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని