ఓటీటీలో ‘మాస్ట్రో’

నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. హిందీలో విజయవంతమైన ‘అంధాధూన్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మేర్లపాక గాంధీ తెరకెక్కించారు.

Updated : 07 Dec 2022 14:23 IST

నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. హిందీలో విజయవంతమైన ‘అంధాధూన్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. నభా నటేష్‌ కథానాయిక. తమన్నా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. ఈనెల 23న సాయంత్రం 5గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నితిన్‌, నభా, తమన్నా కలిసి ఉన్న ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. నితిన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో ప్రకటిస్తామ’’ని నిర్మాతలు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని