‘కొండపొలం’ ఓబులమ్మ

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక.

Updated : 24 Aug 2021 07:34 IST

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. ఇందులో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించింది. ఆమె లుక్‌తో కూడిన వీడియోని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. వైష్ణవ్‌, రకుల్‌ జోడి తెరపై ఓ కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం చెప్పింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అదే పేరుతో అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌.వి.ఎస్‌, కూర్పు: శ్రవణ్‌ కటికనేటి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని