ఆలోచన రేకెత్తించే ‘రిపబ్లిక్‌’

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక.

Updated : 19 Sep 2021 07:31 IST

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ సినిమాని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో సాయితేజ్‌ టోపి పెట్టుకుని సీరియస్‌గా చూస్తూ కనిపించారు.

* ఇటీవల ప్రమాదంలో గాయపడిన సాయితేజ్‌ ప్రస్తుతం స్పృహలోకి వచ్చారని, వెంటిలేటర్‌ తొలగించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని