కొత్త మనుషులు పుడితేనే
సున్నితమైన ప్రేమకథలతో ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. ఆయన చిత్రాలన్నీ మంచి కాఫీలా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. జ్ఞాపకాల ఊసుల్లో హాయిగా ఊరేగిస్తుంటాయి.
సున్నితమైన ప్రేమకథలతో ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. ఆయన చిత్రాలన్నీ మంచి కాఫీలా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. జ్ఞాపకాల ఊసుల్లో హాయిగా ఊరేగిస్తుంటాయి. ఇప్పుడాయన తన మెగాఫోన్తో వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అందమైన ప్రేమకథ ‘లవ్స్టోరీ’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. నారాయణ దాస్.కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు శేఖర్ కమ్ముల.
‘‘లవ్స్టోరీ’ కథకి ‘లీడర్’ సినిమాతోనే బీజం పడింది. ఆ చిత్రంలో నేనెక్కువ ఫోకస్ చేసింది రాజకీయాల్లోని అవినీతినే. రాజకీయాల్లో నాణేనికి మరోవైపు కులం ఉంటుంది. ఆ సినిమాలో దాన్ని కాస్త టచ్ చేసి వదిలేశాను. ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో స్పృశిస్తూ ఓ చిత్రం చేయాలని అప్పటి నుంచే అనుకుంటుండేవాడ్ని. నిర్భయ ఘటన తర్వాత లింగ వివక్షపైనా చర్చించాలి అనిపించింది. చాలా రోజులుగా నా మనసులో నానుతూ వస్తున్న ఇలాంటి అంశాలన్నింటి నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన కథే ‘లవ్స్టోరీ’’.
నా కథలన్నీ అలా పుట్టినవే..
‘‘నేను పుస్తకాలు చదువుతా.. ఆ కథల్ని ఆస్వాదిస్తా. అలాగని వాటి నుంచి ఓ కథ రాయాలని అనుకోను. సినిమాలైనా అంతే. నచ్చితే చూస్తా.. దాన్ని అక్కడితోనే వదిలేస్తా. నా కథలు.. అందులోని భావోద్వేగాలు.. అన్నీ నేను చుట్టూ చూసిన జీవితాల నుంచే తీసుకుంటుంటా. అందరూ ‘మీకంటూ ఓ మార్క్.. స్టైల్ ఉంది’ అంటుంటారు. నిజానికి వాటిని నేనసలు నమ్మను. ఏ దర్శకుడైనా తన మార్క్ ఇది. ఇలాగే తీయాలని చూడరు. భావోద్వేగభరితంగా కథనం ముందుకు నడిపించగలిగితే.. ఎవరు ఏ కథ తీసినా అందంగానే ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు వాళ్లని వాళ్లు మర్చిపోయి తెరపై పాత్రలతో ప్రయాణం చేసేలా చేయగలగాలి. అలా చేసి చూపగలిగితే చాలు.. ఏ దర్శకుడైనా విజయం సాధించినట్లే’’.
అలాంటి కథలు రావాలి..
‘‘ఇటీవల వస్తున్న చిత్రాల్లో తెలుగు భాషలోని వివిధ యాసల సొగసు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జానపదాలు వినిపిస్తున్నారు. కథలకు మట్టి పరిమళాలు అద్దుతున్నారు. ఇది మంచి పరిణామం. నిజానికి ఇదెప్పుడో జరగాల్సింది. భాష, యాసలతో పాటు అందులోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలు.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదోడు, రైతులు ఇలా ప్రతిఒక్కరి జీవితాల్ని వాస్తవికంగా ఆవిష్కరిస్తూ న్యాయం చేసే కథలు మరిన్ని రావాలి. ఈ పరిణామం ఇప్పటికే వేరే భాషల్లో ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ ఆ ఒరవడిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలంగాణ యాసపై పట్టుంది. అందుకే నా చిత్రాల్లో తెలంగాణ సొగసు ఎక్కువ కనిపిస్తుంది’’.
విభిన్నమైన జానర్లో ధనుష్
‘‘దర్శకుడిగా ఇలాంటి సినిమాలు చేయాలని ప్రత్యేకంగా కలలేమీ లేవు. ఓ కథ మదిలో మెదిలిందంటే చాలు.. ఇక అదే నా కల. దాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ప్రస్తుతం నా దృష్టంతా ధనుష్తో చేయనున్న సినిమాపైనే ఉంది. ఓ విభిన్నమైన థ్రిల్లర్ జానర్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలవుతుంది. ‘లీడర్’ సినిమాకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉంది. కచ్చితంగా చేస్తా. అలాగని తొలి భాగానికి కొనసాగింపులా ఉండదు. ఈసారి మరో కొత్త కథ చెప్తా. రానాతో పాటు తొలి భాగంలో ఉన్న పాత్రలతోనే ఆ సీక్వెల్ రూపొందిస్తా. అయితే అది ఎప్పుడు చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేను’’.
* ‘‘నేనే కాదు.. ఎవరైనా తమ చిత్రాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. ‘లవ్స్టోరీ’లో ఆ షేడ్స్ ఉన్నాయి. అలాగే నేను ప్రతి సినిమాని.. అందులోని సన్నివేశాల్ని ఇంతకు మించి ఎవరూ తీయలేరు అన్నట్లుగా చెయ్యాలని ప్రయత్నిస్తా. ఎందుకంటే ఓ పదేళ్ల తర్వాత నాపిల్లలకి నాచిత్రాలు గర్వంగా చూపించగలగాలి అనుకుంటా’’.
అకస్మాత్తుగా పరిష్కారం దొరకదు
* ‘‘సమాజంలోని అసమానతలు, కుల వివక్ష వంటివి ఈ మధ్య మొదలైనవి కావు. ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నాయి. వాటికి అప్పటి నుంచి దొరకని పరిష్కారం.. ఇప్పుడు అకస్మాత్తుగా దొరికేస్తుందనైతే అనుకోను. నిర్భయలాంటి ఘటనలు బయటకొచ్చినప్పుడు ‘అయ్యో’ అని స్పందించేవారు. కానీ, ఇప్పుడివన్నీ మనుషుల జీవితంలో అలవాటు అయిపోతున్నాయి. ఇంకా ఎంత కాలం ఇది తప్పు అని చెప్తూ కూర్చుంటాం. ఏదో పెద్ద సునామి వచ్చేసి.. అందరూ కొట్టుకుపోయి కొత్త మనుషులు పుడితే కానీ ఇవన్నీ మారతాయేమో చూడాలి’’.
చైతూ.. సాయిపల్లవి కనిపించరు
‘‘నాకు నాగచైతన్యలో లవర్బాయ్ ఇమేజ్ కన్నా.. నిజాయతీనే ఎక్కువ కనిపిస్తుంటుంది. నా కథలో రేవంత్ పాత్రకి ఎలాంటి లక్షణాలుండాలో అవన్నీ చైతూలో ఉన్నాయనిపించింది. అందుకే ఈ చిత్రానికి తననే హీరోగా తీసుకోవాలనుకున్నాం. మౌనిక పాత్రకి మొదటి నుంచీ సాయిపల్లవినే అనుకున్నాం. తనకెంతో అనువుగా ఉండే బలమైన పాత్ర ఇది. సినిమాలో డ్యాన్స్ నేపథ్యం ఉంటుంది. దీనికి తోడు చైతూ - సాయిపల్లవి జోడీ తెరపై కొత్తగా, అందంగా కనిపిస్తుందనిపించింది. తెరపై రేవంత్, మౌనికల పాత్రలే కనిపిస్తాయి తప్ప.. చైతన్య, సాయిపల్లవి ఎక్కడా కనిపించరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే