ఒత్తిడి తీసుకోవడం మానేశా
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్ర విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు హీరో సుశాంత్. ‘చి.ల.సౌ’, ‘అల.
‘‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్ర విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు హీరో సుశాంత్. ‘చి.ల.సౌ’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి విజయాల తర్వాత ఆయన నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. ఎస్.దర్శన్ దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈరోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుశాంత్.
‘‘చి.ల.సౌ’ విడుదలకు రెండు నెలల ముందే దర్శన్ నాకీ కథ వినిపించారు. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలతో ఆయన ఈ కథ అల్లుకున్నారు. కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. మరీ సంక్లిష్టమైన కథయితే కాదు కానీ.. వాస్తవికతకు ఎంతో దగ్గరగా ఉంటుంది. అలాగే వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కథ వినగానే చేస్తానని చెప్పా. అయితే మధ్యలో నేను ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయడం వల్ల ఇది ఆలస్యంగా పట్టాలెక్కింది’’.
* ‘‘ఈ సినిమాని గతేడాది ఫిబ్రవరి 1నే ప్రారంభించినా, మార్చి 15 కల్లా మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసేశాం. అందుకే జూన్లోనే విడుదల చేసేద్దామనుకున్నాం. లాక్డౌన్ వల్ల పరిస్థితి అంతా మారిపోయింది. ఈ జనవరి నెలాఖరులో తీసుకొద్దామనుకున్నా.. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమయ్యాయి. ఈలోపు మళ్లీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. మధ్యలో ఓటీటీ ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ, ఇది థియేటర్లలో చూడాల్సిన చిత్రమని ఇన్నాళ్లు ఆగి.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం. నేనిప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ ఇదే’’.
* ‘‘ఈ చిత్రానికి మొదట ‘నో పార్కింగ్’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ, తెలుగులో పేరుండాలని. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్ ఖరారు చేశాం. మిగతా భాషల వారికీ అర్థమవ్వాలని ‘నో పార్కింగ్’ను ఉపశీర్షికగా పెట్టేశాం. ఈ చిత్రం ఇప్పటికే కొంత మందికి చూపించాం. చూసిన ప్రతిఒక్కరూ బాగుందని, చాలా నవ్వుకున్నామని అన్నారు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడన్నారు. చాలా సంతోషంగా అనిపించింది’’.
* ‘‘కుటుంబం..స్నేహితులు.. బంధాలు.. ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ కరోనా వల్ల తెలుసుకున్నా. ఒత్తిడిగా ఫీలవడం కంటే.. మనం మన వాళ్లతో, మనల్ని ప్రేమించే వాళ్లతో ఉన్నామని అనుకోవడం మంచిది. ఈ లాక్డౌన్లో మెడిటేషన్ చేయడం ప్రారంభించా. పియానో నేర్చుకున్నా. పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రత్యేకంగా ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని ఏమీ అనుకోవట్లేదు. సరైన అమ్మాయి దొరికితే చాలు అనుకుంటున్నా. ప్రస్తుతం నేను ఓ ద్విభాషా కథ విన్నా. బాగా నచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా’’.
* ‘‘ఏం చేసినా సొంతంగా చేసుకోవాలని.. మన కాళ్లపై మనమే నిలబడాలని ‘చిలసౌ’కి ముందు నాగార్జున చెప్పారు. అందుకే నాకు నచ్చిన సినిమా చేస్తే ఆ ఫలితం తెరపై కనిపిస్తుందనుకున్నా. అనుమానాలు పెట్టుకుంటే ఏదైనా అంత ఫర్ఫెక్ట్గా రాదనుకున్నా. అప్పటి నుంచే ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మానేశా. ప్రతి చిత్రాన్ని ఆస్వాదిస్తూ చేయడం నేర్చుకున్నా. ఆ విషయాన్ని త్రివిక్రమ్ సర్ పసిగట్టి.. ‘సెట్లో షూట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నావ’న్నారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది.