వాడీ‘జోడీ’ చర్చలు

వరుసగా నాలుగు సినిమాల పనులతో బిజీగా గడుపుతున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి. ‘ఆచార్య’ని తుదిదశకు చేర్చిన ఆయన... ఇప్పుడు మిగతా మూడు సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు.

Updated : 02 Oct 2021 07:27 IST

రుసగా నాలుగు సినిమాల పనులతో బిజీగా గడుపుతున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి. ‘ఆచార్య’ని తుదిదశకు చేర్చిన ఆయన... ఇప్పుడు మిగతా మూడు సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. ‘గాడ్‌ఫాదర్‌’ కోసం రంగంలోకి దిగారు. ‘భోళాశంకర్‌’తోపాటు బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కనున్నాయి. చిరుకి జోడీగా నటించే కథానాయికలకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘భోళాశంకర్‌’లో చిరంజీవికి చెల్లెలుగా కీర్తిసురేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా తమన్నా ఎంపికైనట్టు తెలిసింది. ‘గాడ్‌ఫాదర్‌’ విషయంలోనూ పలువురు పేర్లు వినిపించినా, అందులో చిరుకి జోడీగా కథానాయిక కనిపించదట. ఇక బాబీ  దర్శకత్వం వహించనున్న సినిమా కోసం ఇప్పటికే బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాని సంప్రదించిన విషయం తెలిసిందే. మరి ఆమెనే ఖాయమవుతుందా? అన్నది తెలియాలంటే సినిమా పట్టాలెక్కేవరకు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు