పడి పడి... వాయిదా పడి!
విడుదల తేదీలు ప్రకటించడం... ఆ తర్వాత కొన్నాళ్లకి వాయిదా వేయడం - ఈ తంతు తెలుగు చిత్రసీమలో కొన్నాళ్లుగా పరిపాటిగా మారింది. ఏ సినిమా ఎప్పుడు...
విడుదల తేదీలు ప్రకటించడం... ఆ తర్వాత కొన్నాళ్లకి వాయిదా వేయడం - ఈ తంతు తెలుగు చిత్రసీమలో కొన్నాళ్లుగా పరిపాటిగా మారింది. ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. కరోనాతో ఏర్పడిన పరిణామాలే అందుకు కారణం. రానున్న వినాయక చవితి, దసరా మొదలుకొని... సంక్రాంతి వరకు పండగలే లక్ష్యంగా పలు చిత్రాలు విడుదల తేదీల్ని ప్రకటించాయి. వాటిలో ఒకట్రెండు ఇప్పటికే వెనక్కి తగ్గేశాయి. మరి మిగతా సినిమాల్లో అనుకున్నట్టుగా వచ్చేవెన్ని?
రెండో దశ కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ... సినీ వ్యాపారం ఇంకా గాడిన పడలేదు. పరిమిత వ్యయంతో తెరకెక్కినవే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రాల విడుదల అంటే సాహసంగానే భావించే పరిస్థితి. రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రదర్శనలు ఒకే తరహాలో సాగకపోవడం, టికెట్ ధరల్లో వైరుధ్యాలు ఉండటమే అందుకు కారణం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కరోనా నిబంధనలు కొనసాగుతుండడంతో అక్కడ రోజూ మూడు ఆటలే. సెకండ్ షో ప్రదర్శనల్ని నిలిపివేశారు. అక్కడ టికెట్ ధరల తగ్గింపు కూడా సినిమా విడుదలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే చాలా...
రెండో దశ కరోనా కంటే ముందే సిద్ధమైన సినిమాలు చాలానే ఉన్నాయి. అవి సాధారణ పరిస్థితుల కోసం... సరైన సమయం కోసం వేచి చూస్తూ వచ్చాయి. వాటిలో కొన్ని ఓటీటీ బాట పట్టగా, మరికొన్ని ఇప్పటికీ థియేటర్ లక్ష్యంగానే ముస్తాబై కూర్చున్నాయి. అందులో ‘లవ్స్టోరి’ ఒకటి. వచ్చే నెల 10న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఆలోపు ఆంధ్రప్రదేశ్లో సెకండ్ షోపైన, టికెట్ ధరలపైన ఆ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఊహించారంతా. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. దాంతో ‘లవ్స్టోరి’ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 3న విడుదల కావల్సిన గోపీచంద్ ‘సీటీమార్’ ఇప్పటికే సెప్టెంబర్ 10కి వాయిదా పడింది. ఇలా విడుదల తేదీలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. రూ.వందల కోట్లతో రూపొందిన పాన్ఇండియా సినిమాలు ఆ స్థాయిలో వసూళ్లు సాధించాలంటే ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకి రావల్సిందే. కానీ రెండో దశ కరోనా తర్వాత వసూళ్లని గమనిస్తే... ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో రావడం లేదనే విషయం స్పష్టమవుతోంది. దాంతో యశ్ కథానాయకుడిగా నటించిన ‘కె.జి.ఎఫ్2’ని వచ్చే యేడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా అక్టోబర్ 13న రానట్టే. అందుకే పలు చిత్రాలు ఆ తేదీని లక్ష్యంగా చేసుకుని విడుదలకి సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ ‘అఖండ’ అక్టోబర్ 13న విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇదే నెల 14న ‘మహా సముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 8న వైష్ణవ్తేజ్ ‘కొండపొలం’, అదే రోజున అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ‘ఆచార్య’ ఎప్పుడొస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ఆ సినిమాలైనా వస్తాయా?
2022 సంక్రాంతి లక్ష్యంగా ఇప్పటికే మూడు సినిమాలు విడుదల తేదీల్ని పక్కా చేశాయి. పవన్కల్యాణ్ - రానా కథానాయకులుగా నటించిన ‘భీమ్లానాయక్’, మహేష్ ‘సర్కారు వారి పాట, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు వరుసగా మూడు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ముగ్గురు అగ్ర తారల సినిమాలు ఇలా ఒకేసారి విడుదల కాలేదు. మరి ఇప్పుడు సాధ్యమేనా? అన్నది ప్రశ్న. వీటిలో ఏదో ఒకటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే... ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతోందనే ప్రచారం మరో ఎత్తు. ఆ ప్రచారానికి తగ్గట్టుగా సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైనా ఇప్పటికే ఖరారైన మూడు సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా వేయక తప్పని పరిస్థితి. మొత్తంగా విడుదల తేదీల విషయంలో అనూహ్యంగా మారుతున్న నిర్ణయాల వల్ల ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?