పవన్‌తో నిర్మాతల భేటీ

ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాతల బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యింది.

Updated : 02 Oct 2021 07:42 IST

ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాతల బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యింది. చిత్ర పరిశ్రమకి సంబంధించిన విషయాల గురించి చర్చించింది. ఇటీవలే ఏపీ మంత్రి పేర్ని నానితో ఈ బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. మంత్రిని కలిసి మాట్లాడిన విషయాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన, పోసాని వ్యాఖ్యలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. పవన్‌కల్యాణ్‌ని కలిసినవారిలో దిల్‌రాజు, దానయ్య, నవీన్‌ ఎర్నేని, వంశీ, సునీల్‌ నారంగ్‌, బన్నీ వాస్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని