హే తికమక మొదలే.. ఎద సొద వినదే

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 14న రానుంది. ఈ నేపథ్యంలోనే...

Updated : 01 Oct 2021 07:00 IST

ర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 14న రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ చిత్రం నుంచి మూడోలిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘హే తికమక మొదలే.. ఎద సొద వినదే’’ అంటూ సాగుతున్న ఈ ప్రేమ గీతానికి చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలందించగా.. కిట్టు వరప్రసాద్‌ సాహిత్యమందించారు. హరి చరణ్‌, నూతన్‌ మోహన్‌ ఆలపించారు. పాటలో శర్వానంద్‌, అను ఇమ్మాన్యుయేల్‌, సిద్ధార్థ్‌, అదితీరావు జంట పక్షుల్లా చూడముచ్చటగా కనిపించారు. ‘‘గాఢమైన ప్రేమకథాంశంతో రూపొందిన చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది’’ అని చిత్ర బృందం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని