‘తలైవి’ చిత్రీకరణ పూర్తి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ శుభవార్తను కంగన రనౌత్‌ స్వయంగా ప్రకటించింది. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగన పోషించింది. ఈ సినిమా

Published : 12 Dec 2020 22:39 IST

ముంబయి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ శుభవార్తను కంగన రనౌత్‌ స్వయంగా ప్రకటించింది. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగన పోషించింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయాన్ని కంగన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘ ఈ సినిమా చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  ఒక గొప్ప నాయకురాలి పాత్రను పోషిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇది జీవితకాల అవకాశంగా భావిస్తున్నా‘ అని ఆమె పేర్కొంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి, కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్‌ కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తమిళ హక్కుల్ని రూ.55 కోట్లకు అమెజాన్‌, నెట్‌ప్లిక్స్‌కు ఇప్పటికే ఇచ్చేశారు. జూన్‌ 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

అదే లుక్‌లో ‘తలైవి’గా కంగన


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని