‘ఎంజీఆర్‌’గా అరవింద్ స్వామి...

టాలీవుడ్ అగ్ర నటుడు అరవింద్‌ స్వామి నటించిన చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో ఆయన ఎంజీఆర్‌ పాత్రలో అలరించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఆయన పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ మరణించిన రోజును గుర్తుచేస్తూ ఆయన పోషించిన ఎంజీఆర్‌ పాత్ర కొత్త లుక్‌ను విడుదల చేశారు.

Updated : 24 Dec 2020 15:54 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ హీరో అరవింద్‌ స్వామి నటించిన చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో ఆయన ఎంజీఆర్‌ పాత్రలో అలరించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఆయన పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వర్ధంతిని గుర్తుచేస్తూ ఆయన పోషించిన ఎంజీఆర్‌ పాత్ర కొత్త లుక్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ‘తమిళనాడు పురచ్చితలైవర్‌ ఎంజీఆర్‌ పాత్ర చేయటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎంతో గొప్ప బాధ్యత కలిగిన పాత్ర. నన్ను నమ్మి, నాకు ఈ పాత్రలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ఏఎల్ విజయ్‌, నిర్మాతలు విష్ణువర్ధన్, ఇందూరి, శైలేష్ సింగ్‌లకు ధన్యవాదాలు’ అని అరవింద్ చెప్పారు. ‘ధృవ’ చిత్రంలో అరవింద్‌ ప్రతినాయకుడి పాత్రలో ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్ తమిళనాడు పురచ్చితలైవి జయలలిత పాత్రలో నటించారు. వారిద్దరి జీవితాల గురించి ఎన్నో ఆసక్తికర అంశాలను వీక్షించేందుకు చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే.. ఎంజీఆర్‌ 1972లో డీఎంకే పార్టీని వీడి 1977లో సొంతంగా ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించారు. అనంతరం 1987 డిసెంబర్‌లో కన్నుమూసేవరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇటీవలే తలైవిగా కంగనా రనౌత్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

 





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని