Rajinikanth:అదే ఎస్పీబీ ఆఖరి పాటనుకోలేదు

తన తియ్యని స్వరం రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ అన్నారు. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నాత్త’. సన్‌పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా,

Updated : 05 Oct 2021 06:29 IST

- రజనీకాంత్‌

న తియ్యని స్వరం రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ అన్నారు. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నాత్త’. సన్‌పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బూ తదితరులు నటించారు. ఇమాన్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సింగల్‌ట్రాక్‌ సోమవారం విడుదలైంది. ఎస్పీ బాలు ఈ పాటను పాడారు. ఆయన పాడిన చివరిపాట ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘45 ఏళ్ల పాటు ఎస్పీబీ నా స్వరంగా జీవించారు. ‘అన్నాత్త’లో నా కోసం ఆయన పాడిన పాటే ఆఖరి పాట అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు’’ అని అన్నారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని