ప్రేమంటే నమ్మకమంటున్న రకుల్..!

ప్రస్తుతం రకుల్ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్నారు.  తెలుగు చలనచిత్ర రంగంలో అందరు అగ్ర కథానాయకుల సరసన నటించారు.

Published : 25 Nov 2020 22:51 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం రకుల్ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్నారు.  తెలుగు చలనచిత్ర రంగంలో అందరు అగ్ర కథానాయకుల సరసన నటించారు. ప్రస్తుతం చేతినిండా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తన కుటుంబంతో కలిసి ఆమె మాల్దీవ్స్‌ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె తన తల్లిదండ్రుల 31వ వివాహ వార్షికోత్సవాన్ని అక్కడ జరిపేందుకు తీసుకెళ్లారు. ఎప్పటికప్పుడు ఆమె తన కుటుంబంతో కలిసి ఆనందిస్తున్న క్షణాలను ఫొటోల రూపంలో సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

‘సంధ్యా సమయం వేళ నా కుటుంబంతో కలిసి చాలా సమయం గడుపుతున్నాను. అంతేకాకుండా క్యాంప్‌ ఫైర్‌లో నర్తిస్తున్నాను. అలాగే ‘నా తల్లిదండ్రల మధ్య ఉన్న ప్రేమ వల్ల నేను ప్రేమను నమ్ముతున్నాను’అని ఓ వీడియోను షేర్‌ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోలో తను మాల్దీవ్స్‌ టూర్‌ను పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగొచ్చినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడీ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

2011లో వచ్చిన ‘కెరటం’ చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2014లో సందీప్‌ కిషన్‌తో కలిసి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో నటించారు. ‘లౌక్యం’,‘కరెంట్‌ తీగ’,‘పండగ చేస్కో’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాలతో హిట్‌ సాధించారు. ప్రస్తుతం ఆమె ‘అటాక్‌’, ‘అయలాన్‌’, ‘సర్దార్‌’, ‘గ్రాండ్‌సన్‌’ అలాగే క్రిష్‌ జాగర్లముడి దర్శకత్వంలో ‘ఇండియా 2’, ‘మేడే’ చిత్రాలలో నటించనున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని