ప్రభాస్ మూవీ కోసం లెజండరీ దర్శకుడు
ఒకప్పుడు వరుస షూటింగ్లు.. ఆడియో ఫంక్షన్లు, ప్రతి శుక్రవారం ఓ సినిమా. ఇలా చిత్ర పరిశ్రమ నిత్యం ఏదో ఒక సందడితో కళకళలాడుతుండేది. కరోనా కారణంగా
హైదరాబాద్: ఒకప్పుడు వరుస షూటింగ్లు.. ఆడియో ఫంక్షన్లు, ప్రతి శుక్రవారం ఓ సినిమా. ఇలా చిత్ర పరిశ్రమ నిత్యం ఏదో ఒక సందడితో కళకళలాడుతుండేది. కరోనా కారణంగా ఆ సందడి అంతా కనుమరుగైంది. షరతులతో కూడిన చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమా మళ్లీ పట్టాలెక్కుతోంది. దీంతో రోజుకో ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందాలు అభిమానులతో పంచుకుంటున్నాయి. సోమవారం టాలీవుడ్లోని కొత్త విషయాలు, ఆసక్తికర విశేషాలు మీకోసం..
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కోసం సింగీతం
సాంకేతికపరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఇప్పుడు ఈయన ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రానికి మెంటార్గా వ్యవహరించనున్నారు. చిత్ర బృందానికి తనదైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. సోమవారం సింగీతం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ఆయన సృజనాత్మక ఆలోచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు.
బస్తీ బాలరాజును చూశారా?
యువ కథానాయకుడు కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో కార్తికేయ మృతదేహాలను తరలించే వాహన డ్రైవర్ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆమని కీలక పాత్ర పోషిస్తున్నారు.
అల్లుడు అదుర్స్ షూటింగ్ షురూ
బెల్లకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల్లు అదుర్స్’. నభా నటేశ్ కథానాయిక. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రకాశ్రాజ్, సాయి శ్రీనివాస్ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
‘ఉప్పెన’ నుంచి కృతి మరో లుక్
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకుడు. వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన రెండు పాటలు మాత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కథానాయిక కృతి శెట్టి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. పరిస్థితులు చక్కబడిన వెంటనే సినిమాను విడుదల చేయనున్నారు.
ఏడు మిలియన్ల ఏ పిల్ల.. పరుగున పోదామా!
నాగచైతన్య, సాయిపల్లవి నాయకనాయికలుగా నటిస్తున్న చిత్రం ‘లవ్స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకుడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మొదలైంది. కాగా, ఈ సినిమాలోని ‘ఏ పిల్ల.. పరుగున పోదామా’ లిరికల్ వీడియో వ్యూస్ ఏడు మిలియన్లు దాటింది. పవన్ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని హరిచరణ్ ఆలపించారు. చైతన్య స్వరాలు సమకూర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా