అలా.. మొదలై..ఇలా.. కుదేలై.. మళ్లీ.. విడుదలై..
తెలుగు చిత్రసీమకి విజయాలు అరకొరే. యేటా వందల సంఖ్యలో సినిమాలు విడుదలైతే... అందులో లాభాలు సొంతం చేసుకొనేవి వేళ్లపై లెక్కపెట్టేటన్నే! ఒక విజయం వరించిందంటే... పది పరాజయాలు వెంటాడుతుంటాయి. ఆ ఒక్క విజయమే స్ఫూర్తిగా కొత్త చిత్రాలు....
విజయాలతో ఊరించి.. కరోనాతో ముంచి
బైబై 2020
తెలుగు చిత్రసీమకి విజయాలు అరకొరే. యేటా వందల సంఖ్యలో సినిమాలు విడుదలైతే... అందులో లాభాలు సొంతం చేసుకొనేవి వేళ్లపై లెక్కపెట్టవచ్చు! ఒక విజయం వరించిందంటే... పది పరాజయాలు వెంటాడుతుంటాయి. ఆ ఒక్క విజయమే స్ఫూర్తిగా కొత్త చిత్రాలు పట్టాలెక్కుతుంటాయి. బయట నుంచి చూసేవాళ్లకే విజయాలు, పరాజయాలు అనే లెక్కలు. చిత్రసీమకి మాత్రం ప్రతి సినిమా సమానమే. సినిమాపై అభిరుచి.. ఆకర్షణతో ఎప్పటికప్పుడు కొత్త నిర్మాతలు అడుగు పెడుతూనే ఉంటారు. విజయాలొచ్చినా రాకపోయినా పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూ కనిపిస్తుందంటే కారణం అదే. కానీ, కరోనాతో ఈసారి ఆ కళే మాయమైంది. థియేటర్లు మూతపడటంతో రిలీజ్ల ఊసే లేదు. సెట్స్పైన ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. మునుపటి స్థాయిలో కొత్తవి మొదలు కాలేదు. నిర్మాతల పెట్టుబడులన్నీ స్తంభించిపోయాయి. వడ్డీల భారం పెరిగిపోయింది. కార్మికులకి ఉపాధి కరవైంది. యేడాదిలో దాదాపుగా 200 సినిమాల్ని ఉత్పత్తి చేసే తెలుగు చిత్రసీమ ఈసారి 50 చిత్రాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయాలతో ఊరించి.. కరోనాతో ముంచేసిన ఈ యేడాది ఎలా గడిచిందో చూద్దాం...
ఆరంభం అదుర్స్
ప్రతీ యేడాదిలాగే 2020 సినీ క్యాలెండర్ జోష్తో మొదలైంది. ఒకటో తేదీ నుంచే కొత్త సినిమాలు క్యూ కట్టాయి. అగ్ర తారల సినిమాలు ఊరించాయి. అందుకు తగ్గట్టే సంక్రాంతి సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఎప్పట్లాగే ఈసారి సంక్రాంతికి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. రజనీకాంత్ ‘దర్బార్’, మహేష్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల... వైకుంఠపురములో’, కల్యాణ్రామ్ ‘ఎంత మంచివాడవురా’ విడుదలయ్యాయి. వీటిలో ‘సరిలేరు...’, ‘అల...’ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇవి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో చిత్రసీమలో ఉత్సాహం కనిపించింది. ఆ ఊపు కొనసాగుతుందనే నమ్మకాలు కనిపించినా... అదే నెలలోనే విడుదలైన కొన్ని సినిమాలు పరాజయాల్ని మూటగట్టుకున్నాయి. నితిన్ ‘భీష్మ’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’, శర్వానంద్ - సమంతల ‘జాను’ చిత్రాలతో ఫిబ్రవరి ఊరించింది. విష్వక్సేన్ ప్రధానపాత్రలో హీరో నాని నిర్మించిన ‘హిట్’ కూడా అదే నెల విడుదలైంది. వీటిలో ‘భీష్మ’, ‘హిట్’ సినిమాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ నెలలోనే విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ సరైన ప్రచారం లేక ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది. ‘భీష్మ’ తర్వాత సరైన విజయాల్లేక సతమతమవుతూ వేసవివైపు చూసింది చిత్రసీమ. మార్చిలో ఏ సినిమా కూడా సరైన ఫలితాన్ని రాబట్టలేదు. ప్రేక్షకులు లేక పలు షోలు రద్దయ్యాయి కూడా. ‘పలాస 1978’ ఒక్కటే విమర్శకుల మెప్పు పొందింది. వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కరోనాతో మార్చి 15 నుంచే థియేటర్లు మూతపడ్డాయి. వేసవి సినిమాల విడుదల ఆగిపోయింది.
ఏప్రిల్ నుంచి ఓటీటీలో
థియేటర్ల మూతతో ప్రేక్షకులు వినోదం కోసం కొత్త దారుల్ని వెదుక్కున్నారు. ఓటీటీ వేదికలకి అలవాటు పడిపోయారు. అది గుర్తించిన చిత్రసీమ సినిమాలను ఓటీటీ ద్వారానే విడుదల చేయాలని నిర్ణయించింది. దాంతో ఏప్రిల్ నుంచే ఓటీటీలో సినిమాల రాక మొదలైంది. కీర్తిసురేష్ ‘పెంగ్విన్’ మొదలుకొని ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘అమృతారామమ్’, ‘రన్’ తదితర చిత్రాలు పలు ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. థియేటర్లు తెరిచే వరకు వేచిచూసి, వడ్డీల భారం మోయడం కంటే ఓటీటీల్లో విడుదల చేయడమే మేలనుకున్నారు పలువురు నిర్మాతలు. దాంతో జులై నుంచి పలు సినిమాలు ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో నాని - సుధీర్బాబు ‘వి’, అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి కొన్నే. ‘భానుమతి అండ్ రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘కలర్ఫొటో’, ‘మిడిల్క్లాస్ మెలోడీస్’, ‘డర్టీ హరి’ తదితర చిత్రాలు వినోదాన్ని పంచాయి. సూర్య కథా నాయకుడిగా నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా అలరించింది.
నమ్మకాన్ని పెంచుతూ‘సోలో...’
థియేటర్లకి ప్రేక్షకులు వస్తారా రారా? అనే సందేహాన్ని పటాపంచలు చేయడంతోపాటు, పరిశ్రమలో ఓ నమ్మకాన్ని పెంచింది ‘సోలో బ్రతుకే సో బెటర్’. థియేటర్లు తెరుచుకొన్నాక ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. పరిశ్రమ అంతా ఇది సాధించే ప్రారంభ వసూళ్ల గురించి ఆసక్తిగా ఎదురు చూసింది. చాలా రోజులుగా థియేటర్లకి దూరంగా గడుపుతున్న ప్రేక్షకులు ఎట్టకేలకి కదిలొచ్చారు. కరోనా నిబంధనల మేరకు థియేటర్లలో యాభై శాతం టికెట్లు మాత్రమే విక్రయించినా.. మంచి వసూళ్లనే రాబట్టింది. నిర్మాత ముందే ఓటీటీ సంస్థకి అమ్మి లాభాలు మూటగట్టుకన్నా, థియేటర్ల రూపంలో కూడా సినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఒక రకంగా 2021 సంక్రాంతి సినిమాలకి ఊతమిచ్చిన చిత్రమిదే.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు