Tollywood: ఇంకో లడ్డూ ఉంది నాయనా
తెలుగు చిత్రసీమలో ఊహకు అందని కలయికల్లో సినిమాలు కుదురుతున్నాయి. ఏమాత్రం ప్రచారంలో లేకుండా... అనూహ్యంగా వెలుగులోకి వస్తూ... ఆరంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి - వెంకీ కుడుముల, ప్రభాస్ - మారుతి, రామ్ - బోయపాటి శ్రీను, ‘జనగణమన’ కోసం రెండోసారి కలుస్తున్న విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలే అందుకు తార్కాణం.
తెలుగు చిత్రసీమలో ఊహకు అందని కలయికల్లో సినిమాలు కుదురుతున్నాయి. ఏమాత్రం ప్రచారంలో లేకుండా... అనూహ్యంగా వెలుగులోకి వస్తూ... ఆరంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి - వెంకీ కుడుముల, ప్రభాస్ - మారుతి, రామ్ - బోయపాటి శ్రీను, ‘జనగణమన’ కోసం రెండోసారి కలుస్తున్న విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలే అందుకు తార్కాణం.
కరోనా వల్ల రాబోయే రెండు మూడేళ్లకి సరిపడా సినిమాలన్నీ ముందే ఖరారైపోయాయి. ఆయా హీరోలు, దర్శకులు ఎప్పుడు ఎవరితో కలిసి సినిమాలు చేయనున్నారు? ఎవరి ప్రయాణం ఎలా ఉంటుందనే విషయాల్లో ఇటు ప్రేక్షకులకీ, అటు పరిశ్రమ వర్గాలకీ స్పష్టంగా తెలుసు. హీరోలంతా ముందస్తుగా నాలుగైదు కథల్ని పక్కా చేసి, ప్రకటించడమే అందుకు కారణం. అయినా సరే... వీటి మధ్యలో అనూహ్యంగా కొత్త కలయికలు పుట్టుకొస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అభిమానులకు లడ్డూ లాంటి నూతన తీపి కబుర్లు చెబుతున్నాయి.
మధ్యలో మరోటి..
కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించే విషయంలో ప్రభాస్ ముందు వరసలో ఉన్నారు. ‘రాధేశ్యామ్’, ‘సలార్’ చిత్రాలు చేస్తున్న దశలోనే వరుసగా కొత్త సినిమాల్ని ప్రకటించారు. ‘ఆదిపురుష్’తోపాటు, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ సినిమాల్నీ పక్కా చేశారు. ప్రభాస్ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన వెలువడాలంటే ఒకట్రెండేళ్లయినా పడుతుందని ఊహించారంతా. అనూహ్యంగా మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. వీళ్ల కలయికలో సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే పేరు ప్రచారంలో ఉంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఇది శరవేగంగా పూర్తిచేసే ఆలోచనలో చిత్రవర్గాలు ఉన్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలిసి ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వెంటనే ఈ కలయికలో మరో సినిమా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ‘జనగణమన’ కోసం మరోసారి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ తదితర దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది. ఆయన పూరితో కలిసే మరోసారి రంగంలోకి దిగనున్నారు.
చిరు జోరు
సీనియర్ హీరోల్లో చిరంజీవి జోరు కొనసాగుతోంది. ఆయనా వరుసగా నాలుగు సినిమాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’, ‘భోళాశంకర్’, ‘గాడ్ఫాదర్’తోపాటు బాబీతో చేస్తున్న సినిమా. ఇలా... ఒకొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటి తర్వాత చిరు చేయబోయే సినిమా ఏమిటనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఆయన కొత్త ప్రాజెక్టుల విషయంలో జోరు కొనసాగిస్తూ యువ దర్శకుడు, తన అభిమాని అయిన వెంకీ కుడుములతో సినిమాకి పచ్చజెండా ఊపేశారు. ఈ కలయికలో సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ‘అఖండ’తో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను - యువ కథానాయకుడు రామ్ పోతినేని కలయిక అలా ఆసక్తిని రేకెత్తించేదే. ప్రేక్షకుల్లో ముందుగానే అంచనాల్ని పెంచేదే! ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను... అల్లు అర్జున్తో సినిమా చేస్తారనే ప్రచారం సాగింది. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం రంగంలోకి దిగుతుండడంతో ఆలోపు రామ్తో సినిమా కోసం రంగంలోకి దిగారు బోయపాటి. ఈ ప్రాజెక్ట్ని ఆయన తనదైన శైలిలో... పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కథానాయకులు ముందస్తుగా ఎన్ని సినిమాలు పక్కా చేసుకున్నప్పటికీ... ఆయా పరిస్థితులకి తగ్గట్టుగా మధ్యలో మార్పులు చేర్పులు జరగడం, అనూహ్యంగా కొత్త ప్రాజెక్టులు సెట్ కావడం తరచూ జరిగేదే. అలా రానున్న కాలంలోనూ కొత్త కలయికల్లో చిత్రాలను ఊహించొచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా