Tollywood: ముందుకొస్తున్నాయిక
కథానాయకులే కాదు.. ఇప్పుడు కథానాయికలు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య
కథానాయకులే కాదు.. ఇప్పుడు కథానాయికలు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాల జోరు రెట్టింపైంది. అయితే నిన్నమొన్నటి వరకు ఇలాంటి చిత్రాలనగానేే సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ల పేర్లే ఎక్కువ వినిపించేవి. ఇప్పుడీ రేసులోకి కొత్తతరం నాయికలు వచ్చి చేరుతున్నారు.
సాధారణంగా నాయికా ప్రాధాన్య చిత్రాలనగానే సీనియర్ భామలే గుర్తొస్తారు. బోలెడంత అనుభవం, సినీప్రియుల్లో క్రేజ్ సంపాదించిన వారికే అలాంటి అవకాశాలు దక్కుతుంటాయి. అయితే తొలి అడుగుల్లోనే కృతిశెట్టి కోసం అలాంటి ఓ కథ సిద్ధమైనట్లు తెలిసింది. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరపై ఉవ్వెత్తున ఎగసిపడిన నయా అందాల కెరటం కృతి. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ కన్నడ కస్తూరి.. ప్రస్తుతం రామ్ సరసన ‘ది వారియర్’లో, నితిన్కు జోడీగా ‘మాచర్ల నియోజకవర్గం’లో నటిస్తోంది. ఇప్పుడీ అమ్మడి కోసం విరించి వర్మ ఓ నాయికా ప్రాధాన్య కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడాయన. కాస్త విరామం తర్వాత ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడీ చిత్రం కోసమే కృతిని సంప్రదించినట్లు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ సినిమా చేసేందుకు కృతిశెట్టి అంగీకారం తెలిపిందని ప్రచారం వినిపిస్తోంది. దీనికి చిరంజీవి తనయ సుస్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం కృతి, సుధీర్బాబు జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీన్ని మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు.
అనుపమ... ‘బటర్ఫ్లై’
‘అఆ’ చిత్రంతో తొలి అడుగులోనే తెలుగు వారికి దగ్గరైన మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘శతమానం భవతి’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ వంటి విజయవంతమైన చిత్రాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘రౌడీబాయ్స్’తో పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు నుంచి రానున్న కొత్త సినిమా ‘బటర్ఫ్లై’. అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి నాయికా ప్రాధాన్య చిత్రమిది. గంటా సతీష్బాబు దర్శకుడు. రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటు యువత, అటు కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుపమ త్వరలో ‘హెలెన్’ రీమేక్లో నటించనుందని సమాచారం. మలయాళంలో విజయ వంతమైన ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని తెలుగులో పీవీపీ బ్యానర్ పునర్నిర్మించనుంది. ప్రస్తుతం అనుపమ, నిఖిల్ కలిసి నటిస్తున్న ‘18పేజెస్’, ‘కార్తికేయ 2’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
‘శాకిని ఢాకిని’తో.. నివేదా
నటనా ప్రాధాన్య పాత్రలతో మెప్పిస్తూ.. కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి నాయికా ప్రాధాన్య చిత్రం ‘శాకిని ఢాకిని’. రెజీనా మరో నాయికగా నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకుడు. సురేష్బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరియన్ సినిమా ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్గా రూపొందుతోంది. నిజానికి మాతృకలో కథ మొత్తం హీరో పాత్రల చుట్టూనే అల్లుకున్నా.. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్గా తీర్చిదిద్దారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం.. నివేదా, రెజీనా పలు పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఆద్య’తో తొలిసారి..
నాయికగా.. ప్రతినాయికగా.. సహాయ నటిగా విభిన్నమైన పాత్రలతో అలరించింది వరలక్ష్మి శరత్కుమార్. ఇప్పుడామె ప్రధాన పాత్రలో ఎం.ఆర్.కృష్ణ మామిడాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆద్య’. రజనీకాంత్, ఎస్.పి.ఎస్.ఆర్. కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరలక్ష్మి నటిస్తున్న ఈ తొలి నాయికా ప్రాధాన్య చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో ఆమె లుక్, నటన చాలా కొత్తగా ఉండనున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. డి.శివేంద్ర ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ చిత్రంతో పాటు ‘యశోద’, ‘హను-మాన్’ సినిమాల్లో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ