యువ నటుడు వరుణ్‌ ధవన్‌కి కరోనా

బాలీవుడ్‌ యువ నటుడు వరుణ్‌ ధవన్‌ కరోనా బారిన పడ్డాడు. సీనియర్‌ నటి నీతూ కపూర్‌, దర్శకుడు రాజ్‌ మెహతాకు సైతం పాజిటివ్‌గా తేలింది....

Published : 04 Dec 2020 23:02 IST

సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పలువురికి సోకిన వైరస్‌

ముంబయి: బాలీవుడ్‌ యువ నటుడు వరుణ్‌ ధావన్‌ కరోనా బారిన పడ్డాడు. సీనియర్‌ నటి నీతూ కపూర్‌, దర్శకుడు రాజ్‌ మెహతాకు సైతం పాజిటివ్‌గా తేలింది. రాజ్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్న జుగ్‌ జుగ్‌ జీయో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న వీరు వైరస్‌ బారిన పడ్డారు. అదే షూటింగ్‌లో పాల్గొన్న సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌కి, యువ నటి కియారా అడ్వాణీకి నెగెటివ్‌గా తేలింది.

వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ హీరో-హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం జుగ్‌ జుగ్‌ జియో. నెల రోజుల క్రితం చిత్రీకరణ ప్రారంభించారు. చిత్రంలో అనిల్కపూర్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్‌ నటి నీతూ కపూర్‌ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె చివరిసారిగా బెషరమ్‌ (2013)లో కనిపించారు. జుగ్‌ జుగ్‌ జియో సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం చండీగఢ్‌కు వెళుతూ విమానం వద్ద దిగిన ఫొటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి. కాగా ఇదే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న వరుణ్, నీతాతోపాటు చిత్ర దర్శకుడు రాజ్‌ మెహతా వైరస్‌ బారిన పడ్డారు. మరికొందరికి కూడా వ్యాధి సోకినట్లు సమాచారం.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని