విజయ్‌దేవరకొండకు దుస్తులివ్వనన్నారు

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులరిటీని సొంతం చేసుకున్నారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయనకి దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం అభిమానుల ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్‌ దేవరకొండకు దుస్తులు డిజైన్‌ చేసి ఇచ్చేందుకు పెద్ద డిజైనర్లు ముందుకు రాలేదట...

Published : 21 Sep 2020 16:39 IST

డిజైనర్ల మాటతో షాక్‌ అయ్యా: హీరో స్టైలిస్ట్‌

హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులరిటీని సొంతం చేసుకున్నారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయనకి దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం అభిమానుల ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్‌ దేవరకొండకు దుస్తులు డిజైన్‌ చేసి ఇచ్చేందుకు పెద్ద డిజైనర్లు ముందుకు రాలేదట.

‘‘ఒకప్పుడు దక్షిణాది నటులకు దుస్తులు డిజైన్‌ చేసి ఇచ్చేందుకు పేరుపొందిన కొంతమంది ఫ్యాషన్‌  డిజైనర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారాయి. దక్షిణాది తారలకు దుస్తులివ్వడానికి అప్పుడు ఎవరైతో ఆసక్తి కనబరచలేదో ఇప్పుడు వాళ్లే ఇక్కడ స్టోర్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం కంటే ముందు విజయ్‌ దేవరకొండ ఎవరికీ అంతగా తెలియదు కాబట్టి ఆయనకు దుస్తులు రూపొందించి ఇచ్చేందుకు ఓ డిజైనర్‌ తిరస్కరించాడు. ఇప్పుడు అదే వ్యక్తి నా దగ్గరికి వచ్చి.. ‘మేము ఆయనకి దుస్తులు డిజైన్‌ చేసి ఇవ్వాలనుకుంటున్నాం’ అని చెప్పాడు’’ అని శ్రావ్య పేర్కొంది.

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో విజయ్ నటించారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో విజయ్‌ కథానాయకుడిగా కనిపించనున్నారు. పాన్‌ ఇండియన్‌ మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్యాపాండే సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ఆయన ‘రౌడీ’ బ్రాండ్‌తో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని