‘నాన్నా..నీ మాటలు నేటికీ వినిపిస్తున్నాయి’
సంగీత ప్రపంచానికే మహారాణి, నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయిని లతా మంగేష్కర్ తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆమె రేడియోలో పాడినందుకు తన తండ్రి ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు, థియేటర్ ఆర్టిస్ట్ దీననాథ్ మంగేష్కర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
దిల్లీ: సంగీత ప్రపంచానికే మహారాణి, నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయిని లతా మంగేష్కర్ తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆమె రేడియోలో పాడినందుకు తన తండ్రి ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు, థియేటర్ ఆర్టిస్ట్ దీననాథ్ మంగేష్కర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.
‘79 సంవత్సరాలకు ముందు డిసెంబర్ 16, 1941లో మొదటిసారిగా నేను రేడియోలో పాడాను. రెండు నాట్య గీతాలను ఆలపించాను. నా పాటలను విన్న మా నాన్న గారు చాలా చాలా సంతోషించారు. అంతేకాకుండా ‘ఈ రోజు రేడియోలో లతా ఆలపించిన గీతాలు విన్నాక నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు, దిగులు లేదు’ అని అమ్మతో అన్నారు. ఆ తర్వాత 1942లో నాన్న గారు మరణించారు’ అని ఆమె ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు.
1948లో మజ్బూర్ చిత్రంలోని ‘దిల్ మేరా తోడా’ పాటతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు. 1949లో ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనేవాలా’ పాటతో పాపులర్ అయ్యారు. హిందీ, మారాఠి, బెంగాలీ భాషలే కాకుండా ఇతర స్థానిక భాషల్లోను పాటలను ఆలపించారు. ఎన్నో జాతీయ, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. అలాగే పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత రత్న బిరుదులను సొంతం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్