మెగాహీరోల కోసం తరలి వచ్చిన అభిమానులు

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అభిమానులను అలరిస్తూ వస్తున్న నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాతో ఇటీవల ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు దేవకట్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ‘రిపబ్లిక్‌’ అనే టిటైల్‌ ఖరారు చేశారు.

Published : 22 Feb 2021 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా హీరోలను తెరపై చూస్తేనే ఈలలు వేసి గోల చేస్తారు అభిమానులు. అలాంటిది ఆ అభిమాన హీరోలు తమ ప్రాంతానికి వస్తున్నారంటే ఎలా ఉంటుంది.! ఇటీవల రాజమండ్రిలో జరిగిన ‘ఉప్పెన’ విజయోత్సవ సభలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇక్కడే ‘ఆచర్య’ షూటింగ్‌ జరుగుతోందని ఓ హింట్‌ ఇచ్చాడు. తాజాగా.. ఆ సినిమా చిత్రీకరణ కోసం మెగాస్టార్‌ చిరంజీవి రాజమండ్రి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన మెగాస్టార్‌ తన కారు నుంచి బయటికి వచ్చి అందరికీ అభివాదం చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. మరో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టైటిల్‌తోనే ఆ చిత్రంపై అందరిలో ఆసక్తి రెట్టింపయింది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ నాగార్జున సాగర్‌ సమీపంలోని దేవరకొండలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తన అభిమాన హీరో సాయితేజ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాజేశ్‌ కనిపించనుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని