Tollywood: కనపడేది.. వచ్చే ఏడాది
‘ఏడాదికి ఒక్క సినిమా’ అంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు కావివి. రోజులు మారాయి. పోటీ పెరిగింది. నిధానమే ప్రధానమన్నట్లుగా తీరిగ్గా సినిమాలు చేసే తారలంతా ఇప్పుడు గేరు మార్చి స్పీడు పెంచారు.
2022లో తెలుగు తెరపై సందడి చేయని తారలు
2023 పైనే అభిమానుల ఆశలు
‘ఏడాదికి ఒక్క సినిమా’ అంటూ లెక్కలేసుకొని ముందుకెళ్లే రోజులు కావివి. రోజులు మారాయి. పోటీ పెరిగింది. నిధానమే ప్రధానమన్నట్లుగా తీరిగ్గా సినిమాలు చేసే తారలంతా ఇప్పుడు గేరు మార్చి స్పీడు పెంచారు. అగ్ర కథానాయకులు సైతం ఏక కాలంలో రెండు మూడు చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ఇక కథానాయికల జోరు గురించి ప్రత్యేకంగా చెప్పే పనేలేదు. ఈ ఏడాదిలో దాదాపు నాయకానాయికలందరూ తీరిక లేకుండానే గడిపారు. కొందరు రెండు మూడు చిత్రాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు. అయితే మరికొందరి ప్రయాణం మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. బోణీ కొట్టకుండానే 2022కు వీడ్కోలు పలుకుతున్నారు.
గతేడాది ఆఖర్లో ‘అఖండ’తో బాక్సాఫీస్ ముందుకొచ్చి.. భారీ వసూళ్లతో సత్తా చాటారు కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). కొవిడ్ ఉద్ధృతి తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని సినీ వర్గాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ సినిమాతో పరిశ్రమకు కొత్త ఊపిరి ఊదారు బాలయ్య. అయితే ఆయన నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమూ రాలేదు. ‘అఖండ’ (Akhanda) విడుదలైన వెంటనే గోపీచంద్ మలినేనితో కలిసి ‘వీరసింహారెడ్డి’ని పట్టాలెక్కించినప్పటికీ.. కొవిడ్ మూడో దశ ఉద్ధృతి, చిత్రీకరణల బంద్ తదితర కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. ఇప్పుడీ సినిమాతోనే సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు బాలకృష్ణ. ఆయన బాటలోనే గతేడాది చివర్లో ‘పుష్ప’గా (Pushpa) ప్రేక్షకుల ముందుకొచ్చి.. జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించారు కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun). దీని తర్వాత ఆయన నుంచీ మరో సినిమా రాలేదు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ‘పుష్ప2’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని బన్నీ నిర్ణయించుకోవడంతో 2022లో ఆయన ఖాతా తెరవలేదు. నిజానికి దీన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత లక్ష్యం పెట్టుకున్నారు. కానీ, ‘పుష్ప’ తొలి భాగానికి దక్కిన ఆదరణ ‘పుష్ప2’పై అంచనాల్ని భారీగా పెంచేసింది. దీంతో చిత్ర బృందం ఇందుకు తగ్గట్లుగానే కథను భారీ హంగులతో సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి వచ్చింది. ఫలితంగానే ఆరంభంలో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా.. చివర్లో సెట్స్పైకి వచ్చింది. మంగళవారం నుంచే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాతో మళ్లీ తెరపై మెరవనున్నారు అల్లు అర్జున్.
కథలు కుదరాలే కానీ.. ఏడాది రెండు మూడు చిత్రాలైనా చకచకా చేసేస్తుంటారు కథానాయకుడు సాయిధరమ్ తేజ్ (Saidharam Tej). కెరీర్ ఆరంభం నుంచి ఆయన ఇదే రీతిలో జోరు చూపించారు. అయితే గతేడాది ‘రిపబ్లిక్’ చిత్ర విడుదలకు ముందు తేజు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో.. ఆరు నెలలకు పైగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది ఒక్క సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. సాయితేజ్ ప్రస్తుతం ‘విరూపాక్ష’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిస్టీక్ థ్రిల్లర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న థియేటర్లలోకి రానుంది. కెరీర్ ఆరంభం నుంచీ ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కథానాయకుడు అఖిల్ అక్కినేని. ఆయన ఈ పంథాని ఈ ఏడాదీ కొనసాగించారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’తో గతేడాదికి వీడ్కోలు చెప్పిన ఆయన.. ఈ సంవత్సరం ఒక్క చిత్రం చూపించలేకపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘ఏజెంట్’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నించినప్పటికీ.. చిత్రీకరణ ఆలస్యమవడం వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ నాయికలూ కనిపించలేదు..
‘అరుంధతి’, ‘భాగమతి’ చిత్రాలతో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారిన అనుష్క.. అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో మరీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే కొన్నాళ్లుగా ఆమె నుంచి ఏడాదికి ఒక్కో చిత్రం రావడమే గగనమైపోయింది. ‘నిశ్శబ్దం’ తర్వాత రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండటంతో ఈ ఏడాది ఒక్క సినిమానీ ప్రేక్షకుల ముందుకు తేలేకపోయింది. ఆమె ప్రస్తుతం యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. మహేష్బాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘కాటమరాయుడు’ తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా గడిపింది శ్రుతిహాసన్. ఆమె ‘క్రాక్’ వంటి హిట్తో గతేడాది ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి మునుపటిలా వరుస సినిమాలతో జోరు చూపాలని ప్రణాళిక రచించింది. అందుకు తగ్గట్లుగానే ‘సలార్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ ప్రాజెక్ట్ల్లో అవకాశాలు అందుకుంది. అయితే చిత్రీకరణలో జాప్యం కారణంగా ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈలోటును కొత్త ఏడాదిలో వడ్డీతో సహా తిరిగి వడ్డించనుంది శ్రుతి. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో డబుల్ ట్రీట్ అందించనుంది. అలాగే ద్వితీయార్ధంలో ‘సలార్’తో సందడి చేయనుంది. ఈ ఏడాది హిందీలో ఏకంగా నాలుగు సినిమాలతో సందడి చేసింది నటి రకుల్ ప్రీత్ సింగ్. కానీ, ఆమె తెలుగులో ఒక్క చిత్రాన్నీ అందించలేకపోయింది. కొన్నాళ్లుగా పూర్తిగా హిందీ సీమపైనే దృష్టి పెట్టిన ఈ అమ్మడు.. తెలుగులో కొత్తగా ఏ కథకీ ఓకే చెప్పలేదు. ఫలితంగానే ‘కొండపొలం’ తర్వాత ఆమె నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. ప్రస్తుతం ఆమె కమల్హాసన్తో కలిసి ‘భారతీయుడు 2’లో.. శివ కార్తికేయన్తో కలిసి ‘అయలాన్’లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలూ అనువాదాలుగా వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..