Aadavallu Meeku Johaarlu: చూడముచ్చటగా శర్వా- రష్మిక జోడీ.. అలరిస్తున్న ‘ఆడవాళ్లు..’ ట్రైలర్‌

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.

Updated : 27 Feb 2022 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల దర్శకత్వ వహించారు. ఈ సినిమాను మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని పాటలు, టీజర్‌లను విడుదల చేయగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. టైటిల్‌కు తగ్గట్టే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. ఖుష్బూ, రాధిక, ఊర్వశి వంటి సీనియర్‌ నటీమణులు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ తారలు కనిపించిన ప్రతి ఫ్రేమూ చూడముచ్చటగా ఉంది. శర్వానంద్‌, రష్మిక జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని