Aadavallu Meeku Joharlu: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్‌.. ఆకట్టుకుంటున్న శర్వా- రష్మిక!

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల దర్శకుడు.

Published : 10 Feb 2022 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల దర్శకుడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ పాటను విడుదల చేయగా టీజర్‌ను గురువారం రిలీజ్‌ చేసింది. టైటిల్‌కు తగ్గట్టే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. శర్వానంద్‌, రష్మిక జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాకి కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని