Tees Maar Khan: పక్కా వాణిజ్య సినిమా ఇది
‘‘అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా ఉండాలనుకుంటాను.
‘‘అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మన సినిమా ఉండాలనుకుంటాను. మంచి మనుషులు కలిసి చేసిన ‘తీస్మార్ ఖాన్’ తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రముఖ నటుడు సాయికుమార్. ఆయన తనయుడు ఆది సాయికుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమే ‘తీస్మార్ ఖాన్’. పాయల్ రాజ్పూత్ కథానాయిక. కల్యాణ్ జి.గోగణ దర్శకత్వం వహించారు. డా.నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకులు సుధీర్బాబు, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుధీర్బాబు మాట్లాడుతూ ‘‘నేను, ఆది కలిసి ‘శమంతకమణి’ చేశాం. అద్భుతమైన నటుడు. తనకి సరైన సినిమా అనిపిస్తోంది. పాటలు, ట్రైలర్ బాగున్నాయి. చిత్రం అలరిస్తుంద’’న్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్లో ఆది చాలా బాగా కనిపించాడు. అందరూ థియేటర్లలో చూడాలనేది నా కోరిక’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఆది పాత్ర కొత్తగా అనిపిస్తోంది. సాయికార్తీక్ సంగీతం బాగుంది’’ అన్నారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన పక్కా వాణిజ్య చిత్రం ఇది. మంచి భావోద్వేగాలు ఉంటాయి. పాయల్ మంచి సహనటి. సునీల్ చేసిన చక్రి పాత్ర చాలా బాగుంటుంది. నన్ను కొత్తగా చూపించిన దర్శకుడు కల్యాణ్కి కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘మూడేళ్ల తర్వాత నా సినిమా థియేటర్లో వస్తోంది. అందుకే నాకెంతో ప్రత్యేకం. నేనేమీ స్టార్ల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కాను. నేనేం చేసినా సొంతంగా చేశా. ప్రేక్షకుల ప్రేమాభిమానంతోనే ఇంత దూరం ప్రయాణించా’’ అన్నారు కథానాయిక పాయల్ రాజ్పూత్. ఆది కెరీర్లోనే అత్యుత్తమమైన సినిమా ఇస్తానని చెప్పి ఈ సినిమా చేశానన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు సాయికార్తీక్ ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..