Abhishek Bachchan: ఐశ్వర్య చెప్పిన ఆ మాట.. నాలో మార్పు తీసుకొచ్చింది: అభిషేక్‌ బచ్చన్‌

నటి, తన భార్య ఐశ్వర్యరాయ్‌ చెప్పిన ఓ మాటతో మార్పొచ్చిందని అభిషేక్‌ బచ్చన్‌ అన్నారు.

Published : 01 Apr 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భార్య ఐశ్వర్యరాయ్‌ చెప్పిన ఓ మాటతో జీవితంలో మార్పొచ్చిందని అభిషేక్‌ బచ్చన్‌ అన్నారు. ఆమె వల్లే తనలో పాజిటివ్‌ దృక్పథం అలవడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నీ పనితీరును వేలమంది ప్రశంసిస్తుంటారు. ఒకరు విమర్శిస్తారు. ఈ రెండింటిలో నువ్వు నెగిటివిటీకే ఎక్కువ ప్రభావితమవుతావు. దాని గురించే ఆలోచిస్తుంటావు. అలా కాకుండా పాజిటివిటీని మాత్రమే తీసుకో. పాజిటివ్‌ ప్రపంచాన్ని ఆస్వాదించు. అప్పుడు ఎలా ఉంటుందో చూడు’ అని హితబోధ చేసింది. అప్పటి నుంచి ప్రతి విషయాన్ని పాజిటివ్‌ కోణంలో చూస్తున్నా. నెగిటివిటీ, విమర్శలను ఎదుర్కొనేందుకు ఇదే నా మంత్ర. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు విమర్శలను సానుకూలంగా తీసుకుంటుంటా. నా పరాజయాలను పాఠాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటా’’ అని అభిషేక్ తెలిపారు.

‘ఉమ్రావు జాన్‌’, ‘గురు’, ‘కుచ్‌ నా కహో’, ‘రావన్‌’ తదితర చిత్రాల్లో కలిసి నటించిన అభిషేక్‌- ఐశ్వర్య 2007లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య అనే పాప ఉంది. అభిషేక్‌ నటించిన తాజా చిత్రం ‘దస్వీ’. యామి గౌతమ్‌, నిమ్రత్‌ కౌర్‌ కథానాయికలు. తుషార్‌ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ‘జియో సినిమా’, ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఏప్రిల్‌ 7న విడుదలకానుంది. మరోవైపు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో ఐశ్వర్య బిజీగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని