Vishal: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విశాల్‌

విశాల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మార్క్‌ ఆంటోనీ’. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా విశాల్‌ కింద పడిపోగా అదే సమయంలో ఆయన పక్కనుంచి భారీ ట్రక్కు వెళ్లింది. దీంతో ఆయన తృటిలో పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు.

Updated : 22 Feb 2023 23:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు విశాల్‌ (Vishal) పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాల్‌ హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాన్ని చెన్నైలో చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సీన్‌లో భాగంగా విశాల్‌ నేలపై పడిపోగా..  అదే సమయంలో వెనక నుంచి ఓ భారీ ట్రక్కు వేగంగా ఆయన పక్కన నుంచి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ విజువల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలుకాలేదు. త్వరలోనే తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన విశాల్‌ ‘‘కొన్నిసెకన్లు, కొన్ని అంగుళాల దూరంలో చావును చూశా’’ అంటూ పోస్ట్‌ పెట్టారు. నెటిజన్లు, అభిమానులు జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ కొన్ని సినిమాల చిత్రీకరణలో విశాల్‌ గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని