Acharya: సిద్ధ పాత్ర చరణ్ చేయకపోతే పవన్కల్యాణ్ బెస్ట్: చిరంజీవి
Acharya: ఆచార్య చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్మీట్లో చిరంజీవి, రామ్చరణ్, కొరటాల శివ పంచుకున్న విశేషాలివి...
హైదరాబాద్: నిజమైన తండ్రీకొడుకుల అనుబంధం ‘ఆచార్య’(Acharya) కథకు అదనపు బలాన్ని తీసుకొస్తుందనే ఉద్దేశంతోనే సిద్ధ పాత్ర కోసం చరణ్ (Ram charan)ను తీసుకున్నామని, ఒకవేళ ఆ పాత్రను చరణ్ చేసే అవకాశం లేకపోయినా, ఇంకా ఏ ఇతర నటులూ కుదరకపోయినా ఆ ఫీల్ ఒక్క పవన్కల్యాణ్ (Pawan kalyan)తోనే సాధ్యమని అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) అన్నారు. రామ్చరణ్తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఆచార్య’(Acharya). కొరటాల శివ ఈ చిత్ర దర్శకుడు. పూజా హెగ్డే(Pooje hegde) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చిరంజీవి, రామ్చరణ్, కొరటాల శివ, పూజాహెగ్డేలు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
నిజ జీవితంలో మీరు ఆచార్యగా భావించింది ఎవరిని?
చిరంజీవి: నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా. అందుకే ప్రతి ఒక్కరినీ ‘ఆచార్య’గానే భావిస్తా.
‘ఆర్ఆర్ఆర్’ షూట్ చేస్తున్నప్పుడు ఇందులో నటించా. రామరాజు పాత్ర నుంచి సిద్ధగా మారడానికి ఎంత సమయం పట్టింది?
రామ్చరణ్: కథ విన్న వెంటనే సిద్ధ పాత్రను ఆకళింపు చేసుకున్నా. ఇటీవల రాజమౌళి చెప్పినట్లు సెట్లోకి నేను తెల్ల కాగితంలా అడుగుపెడతా. కొరటాల చెప్పిన కథ, మాటలు వినే ఈ పాత్రను అర్థం చేసుకున్నా. చిరంజీవిగారి పక్కన చేయడం నిజంగా ఒత్తిడితో కూడుకొన్నదే. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా.
‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లో ఉండగానే మీరు నటించిన ‘ఆచార్య’(Acharya)విడుదలవుతోంది. దీన్ని మీరెలా ఫీలవుతున్నారు.
రామ్చరణ్: ఇది నా సినిమా కాదు. చిరంజీవిగారిది. నేను కేవలం అతిథి పాత్ర మాత్రమే చేస్తున్నా.
రామ్చరణ్ ద్వారా మీరేమైనా నేర్చుకున్నారా?
చిరంజీవి: చరణ్ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది. దర్శకుడు అనుకున్నది వచ్చిందా? లేదా? అని చూసుకునేంత వరకూ కెమెరా ముందే ఉంటాడు. డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. నేను పాటించే ప్రతి పద్ధతినీ తనూ అనుసరిస్తున్నాడు. ఇక సీన్ అయిపోయిన తర్వాత కారావ్యాన్లోకి వెళ్లిపోకుండా సెట్లో అందరితోనూ కలివిడిగా ఉంటాడు. నేను కూడా అలాగే చేసేవాడిని. రకరకాల వంటకాలు చేయించి, అందరికీ అందేలా చూస్తాడు. అయితే, ఈ సినిమాకు మాత్రం మారేడుమిల్లిలో ఉండగా నాకు అన్యాయం జరిగింది. సురేఖను రమ్మంటే ‘వద్దు అమ్మా రావొద్దు’ అని ఆపేశాడు. ‘అమ్మ వస్తే నేను నీతో ఉండే సమయం తగ్గిపోతుంది. ఇలా కలిసి ఉండటం సాధ్యం కాదు’ అంటూ సురేఖను ఆపేశాడు. (నవ్వులు)
సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చరణ్ను తండ్రికి తగ్గ తనయుడు అంటారా?
కొరటాల శివ: చిరంజీవిగారి స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్లో ఉంటుంది. తెరపై ఆయన ఉంటే కళ్లు మరొకరిపై ఉండవు. మారేడుమిల్లిలో ఒక సీన్ తీసిన తర్వాత మాకున్న భయమంతా పోయింది. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని మరిపించేలా చరణ్ కనిపిస్తారు.
చిరంజీవి: నేను 1 నుంచి 150 సినిమా వరకూ నేర్చుకుంటూ వచ్చా. చరణ్ నా 150 సినిమాలను చూసి అక్కడి నుంచి తన ప్రయాణం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకున్నాడు. నేను ‘అ ఆ’ల నుంచి మొదలు పెడితే చరణ్ ఏకంగా యూనివర్సిటీకి వెళ్లిపోయాడు.
శ్రీకాకుళంలోని సుబ్బారావు ప్రాణిగ్రాహి అనే వ్యక్తి జీవిత కథ నుంచి ‘ఆచార్య’ తీసుకున్నారా?
కొరటాల శివ: ‘ఆచార్య’ పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. నాకు నేనుగా రాసుకున్న కథ. ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు.
ఖైదీ నంబర్ 150 తర్వాత కొత్త దర్శకులతో పనిచేయడం ఎలా అనిపించింది?
చిరంజీవి: పాత.. పాతా కలిస్తే ఏమవుతుంది మోత తప్ప. కొత్త ఆలోచనలకు స్వాగతం పలకాలి. అందుకే కొత్త వారిని ప్రోత్సహిస్తున్నా.
కమ్యూనిజం, కాషాయం ఒకే కథలో చూపించటం ఎలా అనిపించింది?
కొరటాల శివ: రెండూ వేర్వేరు అంశాలు. అయితే, మేము కేవలం నేపథ్యాలను మాత్రమే తీసుకున్నాం తప్ప ఆలయాలు, నక్సలిజం గురించి ఇందులో చెప్పటం లేదు. ఆ నేపథ్యాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఈ చిత్రంలో ఉంటుంది.
చిరంజీవి సినిమా అంటే థియేటర్లన్నీ హౌస్ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు టికెట్ రేట్లు పెంచటం అవసరమా?
కొరటాల శివ: సినిమా బడ్జెట్ బట్టి టికెట్ రేట్లు పెంచాం తప్ప. పెంచాలి కాబట్టి ధరలు పెంచలేదు.
చిరంజీవి: కరోనా సమయంలో ప్రతి సంస్థ, రంగం కుదేల్ అయిపోయాయి. అందుకు సినిమా ఇండస్ట్రీ మినహాయింపు ఏమీ కాదు. సినిమాలు ఆగిపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. టికెట్ ధరలు పెంచి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాలను వేడుకున్నాం. ప్రజలపై భారం పడకుండా ధరలు పెంచారు.
సిద్ధ పాత్రలో పవన్కల్యాణ్ ఉంటే బాగుండేదనిపించిందా?
చిరంజీవి: చరణ్ కాకుండా మరే నటుడైనా సిద్ధ పాత్రకు న్యాయం చేసేవారే. అయితే, నిజ జీవితంలో తండ్రీకొడుకులు ఈ పాత్రలు చేస్తే, వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. కథకు అదనపు బలం చేకూరుతుంది. ఒకవేళ చరణ్ కూడా చేయకపోతే ప్రత్యామ్నాయం పవన్ కల్యాణ్. ఎందుకంటే కథలో ఆ ఫీల్100శాతం పవన్ తీసుకువస్తాడని నా అభిప్రాయం. అంతవరకూ ఛాన్స్ తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.