గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో అజయ్‌ దేవగణ్‌

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్‌లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో గురువారం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమం చేపట్టారు.

Updated : 07 Jan 2021 17:29 IST

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్‌లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో గురువారం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో దండు మల్కాపూర్ నుంచి పార్కు వరకూ డప్పు కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను అజయ్‌ దేవగణ్‌ అభినందించారు. కార్యక్రమంలో పార్క్ అధికారులు, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇవీ చదవండి..

ఇంటర్‌ విద్యార్థులకు.. మరింత ఛాయిస్‌

సంక్రాంతి ప్రయాణమా.. ఆర్టీసీ బస్సులు సిద్ధం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని